HomeతెలంగాణParty Defections | స్పీకర్​ కీలక నిర్ణయం.. పార్టీ మారిన ఎమ్మెల్యేల విచారణకు షెడ్యూల్​ విడుదల

Party Defections | స్పీకర్​ కీలక నిర్ణయం.. పార్టీ మారిన ఎమ్మెల్యేల విచారణకు షెడ్యూల్​ విడుదల

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Party Defections | రాష్ట్రంలో పార్టీ మారిన ఎమ్మెల్యేల విచారణకు స్పీకర్​ గడ్డం ప్రసాద్​కుమార్​ సిద్ధం అయ్యారు. ఈ మేరకు స్పీకర్​ కార్యాలయం(Speaker Office) శనివారం షెడ్యూల్ విడుదల చేసింది.

రాష్ట్రంలో కాంగ్రెస్​ అధికారంలోకి రావడంతో బీఆర్​ఎస్​ నుంచి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరిన విషయం తెలిసిందే. పార్టీ మారిన వారిలో ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావ్ (భద్రాచలం), కడియం శ్రీహరి (స్టేషన్​ ఘన్​పూర్​), దానం నాగేందర్​ (ఖైరతాబాద్​), పోచారం శ్రీనివాస్​రెడ్డి (బాన్సువాడ), బండ్ల కృష్ణమోహన్​రెడ్డి (గద్వాల), కాలే యాదయ్య (చేవేళ్ల), సంజయ్​ కుమార్​ (జగిత్యాల), ప్రకాశ్​గౌడ్​ (రాజేంద్రనగర్​), అరికపూడి గాంధీ (శేరిలింగంపల్లి), మహిపాల్​రెడ్డి (పటాన్​చెరు) ఉన్నారు.

Party Defections | సుప్రీం తీర్పుతో..

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్​ఎస్​ నాయకులు సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించారు. ఈ పిటిషన్​పై విచారణ చేపట్టిన ధర్మాసనం మూడు నెలల్లో స్పీకర్​ నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. దీంతో స్పీకర్​ ప్రసాద్​కుమార్ (Gaddam Prasad Kumar)​ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. అలాగే బీఆర్​ఎస్​ పార్టీకి సైతం నోటీసులు పంపారు. ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో పలువురు తాము ఇంకా బీఆర్​ఎస్​లోనే కొనసాగుతున్నట్లు వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో వారిని విచారించడానికి స్పీకర్​ కార్యాలయం తాజాగా షెడ్యూల్​ విడుదల చేసింది.

Party Defections | పదో షెడ్యూల్​ ప్రకారం..

స్పీకర్​ పదో షెడ్యూల్​ ప్రకారం ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్​పై ​(MLA Disqualification Petition) విచారణ చేపట్టనున్నారు. సోమవారం స్పీకర్​ పలువురు ఎమ్మెల్యేను విచారించనున్నారు. ఎమ్మెల్యేల తరఫు న్యాయవాదులు, ఫిర్యాదు చేసిన బీఆర్​ఎస్ ఎమ్మెల్యేల తరఫు న్యాయవాదులను క్రాస్​ ఎగ్జామిన్​ చేయనున్నారు. అక్టోబర్​ 1న మరోసారి విచారణ చేపట్టారు. సోమవారం ఉదయం 11 గంటలకు ప్రకాష్ గౌడ్, 12 గంటలకు కాలే యాదయ్య, మధ్యాహ్నం ఒంటి గంటలకు మహిపాల్​రెడ్డి, 3 గంటలకు బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని విచారించనున్నారు.

Must Read
Related News