అక్షరటుడే, హైదరాబాద్: Speaker issues notices | రాష్ట్రంలో పార్టీ మారిన ఆరుగురు ఎమ్మెల్యేలకు తెలంగాణ అసెంబ్లీ Assembly స్పీకరు Speaker గడ్డం ప్రసాద్ నోటీసులు జారీ చేశారు. భారాస నుంచి కాంగ్రెస్లోకి జంప్ అయిన ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్రెడ్డి, సంజయ్, కాలె యాదయ్య, కృష్ణమోహన్రెడ్డి, తెల్లం వెంకట్రావు, మహిపాల్రెడ్డికి శుక్రవారం నోటీసులు పంపించారు.
వీరితోపాటు బీఆర్ఎస్ నేతలకు కూడా నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు మరిన్ని ఆధారాలు అందజేయాలని స్పష్టం చేశారు.
Speaker issues notices | ఎన్నో నాటకీయ పరిణామాలు..
2023 సంవత్సరం ఎండింగ్లో అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఓటర్లు కాంగ్రెస్కు పట్టం కట్టారు. ఓటర్ల తీర్పుతో భారాస ప్రతిపక్షానికి పరిమితమైంది.
ఓటర్ల ఆశీర్వాదంతో రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ సర్కారు కొలువుదీరింది. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశాక.. ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టారు. అలా భారాస ఎమ్మెల్యేల్లో పలువురు కాంగ్రెస్ గూటికి చేరారు.