Kamareddy Courts | తండ్రిని చంపిన తనయుడికి జీవిత ఖైదు

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Courts | వృద్ధాప్యంలో తండ్రికి అండగా ఉండాల్సిన కొడుకు కాలయముడిగా మారాడు. నిద్రిస్తున్న తండ్రిని రుమాలితో హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు. కోర్టులో నేరం రుజువు కావడంతో కటకటాలపాలయ్యాడు. నాగిరెడ్డిపేట (Nagireddypet) మండలం జలాల్​పూర్ (Jalalapur)​ గ్రామానికి చెందిన జన్కంపల్లి విఠల్​కు ఇద్దరు కుమారులు ఉండగా ఒకే ఇంట్లో వేరువేరుగా నివసిస్తున్నారు. 2021 మార్చి 15న రాత్రి భోజనం విషయంలో తండ్రికి చిన్న కొడుకు సంగమేశ్వర్​కు గొడవ జరగగా.. తండ్రిపై చేయిచేసుకున్న కొడుడు నీ […]

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Courts | వృద్ధాప్యంలో తండ్రికి అండగా ఉండాల్సిన కొడుకు కాలయముడిగా మారాడు. నిద్రిస్తున్న తండ్రిని రుమాలితో హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు. కోర్టులో నేరం రుజువు కావడంతో కటకటాలపాలయ్యాడు.

నాగిరెడ్డిపేట (Nagireddypet) మండలం జలాల్​పూర్ (Jalalapur)​ గ్రామానికి చెందిన జన్కంపల్లి విఠల్​కు ఇద్దరు కుమారులు ఉండగా ఒకే ఇంట్లో వేరువేరుగా నివసిస్తున్నారు. 2021 మార్చి 15న రాత్రి భోజనం విషయంలో తండ్రికి చిన్న కొడుకు సంగమేశ్వర్​కు గొడవ జరగగా.. తండ్రిపై చేయిచేసుకున్న కొడుడు నీ అంతుచూస్తానని హెచ్చరించారు.

చెప్పినట్టుగానే తెల్లవారుజామున ఉదయం 6 గంటల సమయంలో నిద్రిస్తున్న తండ్రిని టవల్​తో ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. తాను చంపినట్టుగా అనుమానం రాకుండా దూలానికి ఉరేసుకొని చనిపోయినట్టు చిత్రీకరించాడు. ఈ విషయమై మృతుని కూతురు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేయగా తండ్రి విఠల్​ తనకు తరచూ అన్నం పెట్టకుండా ఇబ్బంది పెట్టేవాడని పేర్కొన్నాడు.

అలాగే విఠల్ వృద్ధాప్యం కారణంగా స్వయంగా పనులు చేసుకోలేకపోవడంతో అతని బాగోగులు చూసుకోలేక తండ్రిన చంపాలని కొడుకు నిర్ణయించుకున్నట్లు తేలింది. ఈ కేసులో సాక్ష్యాధారాలను పోలీసులు కోర్టుకు (Kamareddy Courts) సమర్పించడంతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి వరప్రసాద్ (Chief District Judge Varaprasad) నిందితునికి జీవితఖైదు విధిస్తూ తీర్పునిచ్చారు.

shashi kiran Mottala
shashi kiran Mottala
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

Godavari Pushkaralu Preparations | గోదావరి పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్​ ఇలా త్రిపాఠి

గోదావరి పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్​ ఇలా త్రిపాఠి అధికారులను సూచించారు. ఈ మేరకు కందకుర్తి పుష్కర ఘాట్​ను ఆమె బుధవారం సందర్శించారు.

Assistant Professors Terminated | మెడికల్ కళాశాలలో ఏడుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్ల తొలగింపు.. ఉత్తర్వులు జారీ చేసిన డీఎంఈ

నగరంలోని మెడికల్ కళాశాలలో ఏడాదికి పైగా విధులకు గైర్హాజరవుతున్న అసిస్టెంట్ ప్రొఫెసర్లపై వైద్యవిధాన పరిషత్​ కొరడా ఝలిపించింది. ఈ సందర్భంగా ఏడుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లను తొలగిస్తూ ఉత్తర్వూలు జారీ చేసింది.

Basara IIIT Student | బాసర ట్రిపుల్​ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Basara IIIT Student | నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్​ ఐటీ (IIIT)లో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇంజినీరింగ్​...

KTR on Mallanna Jathara | దైవ దర్శనానికి వెళ్తే దాడి చేస్తారా : కేటీఆర్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR on Mallanna Jathara | నాగర్​ కర్నూల్ (Nagar Kurnool) జిల్లా కుమ్మెర మల్లన్న (Kummera Mallanna) జాతరలో...