Homeజిల్లాలుకామారెడ్డిKamareddy Courts | తండ్రిని చంపిన తనయుడికి జీవిత ఖైదు

Kamareddy Courts | తండ్రిని చంపిన తనయుడికి జీవిత ఖైదు

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Courts | వృద్ధాప్యంలో తండ్రికి అండగా ఉండాల్సిన కొడుకు కాలయముడిగా మారాడు. నిద్రిస్తున్న తండ్రిని రుమాలితో హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు. కోర్టులో నేరం రుజువు కావడంతో కటకటాలపాలయ్యాడు.

నాగిరెడ్డిపేట (Nagireddypet) మండలం జలాల్​పూర్ (Jalalapur)​ గ్రామానికి చెందిన జన్కంపల్లి విఠల్​కు ఇద్దరు కుమారులు ఉండగా ఒకే ఇంట్లో వేరువేరుగా నివసిస్తున్నారు. 2021 మార్చి 15న రాత్రి భోజనం విషయంలో తండ్రికి చిన్న కొడుకు సంగమేశ్వర్​కు గొడవ జరగగా.. తండ్రిపై చేయిచేసుకున్న కొడుడు నీ అంతుచూస్తానని హెచ్చరించారు.

చెప్పినట్టుగానే తెల్లవారుజామున ఉదయం 6 గంటల సమయంలో నిద్రిస్తున్న తండ్రిని టవల్​తో ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. తాను చంపినట్టుగా అనుమానం రాకుండా దూలానికి ఉరేసుకొని చనిపోయినట్టు చిత్రీకరించాడు. ఈ విషయమై మృతుని కూతురు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేయగా తండ్రి విఠల్​ తనకు తరచూ అన్నం పెట్టకుండా ఇబ్బంది పెట్టేవాడని పేర్కొన్నాడు.

అలాగే విఠల్ వృద్ధాప్యం కారణంగా స్వయంగా పనులు చేసుకోలేకపోవడంతో అతని బాగోగులు చూసుకోలేక తండ్రిన చంపాలని కొడుకు నిర్ణయించుకున్నట్లు తేలింది. ఈ కేసులో సాక్ష్యాధారాలను పోలీసులు కోర్టుకు (Kamareddy Courts) సమర్పించడంతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి వరప్రసాద్ (Chief District Judge Varaprasad) నిందితునికి జీవితఖైదు విధిస్తూ తీర్పునిచ్చారు.

Must Read
Related News