ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిVarni | పింఛన్​ డబ్బుల కోసం తల్లిని హత్య చేసిన తనయుడు

    Varni | పింఛన్​ డబ్బుల కోసం తల్లిని హత్య చేసిన తనయుడు

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ: Banswada | సమాజంలో మానవ సంబంధాలకు విలువ లేకుండా పోతోంది. అక్రమ సంబంధాలు, డబ్బులు, కుటుంబ తగాదాలతో ఇలా నిత్యం హత్యలు జరుగుతున్నాయి. స్వార్థం కోసం సొంత వారినే పొట్టన పెట్టుకుంటున్న ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి ఘటనలు చూస్తుంటే సమాజం ఎటు పోతుందనే ఆందోళన కలుగుతోంది. తాజాగా పింఛన్​ డబ్బుల కోసం నవ మాసాలు మోసి కని పెంచిన తల్లిని కొడుకు హత్య చేశాడు. ఈ ఘటన నిజామాబాద్​ జిల్లా వర్ని(varni) మండలంలో గురువారం చోటు చేసుకుంది.

    ఎస్సై మహేష్ (SI Mahesh) తెలిపిన వివరాల ప్రకారం.. వర్ని మండలం జలాల్​పూర్​ (jalalpur) గ్రామానికి చెందిన మక్కపల్లి సాయవ్వ(57)తో కొడుకు సాయిలు పింఛన్ డబ్బుల విషయంలో గొడవపడ్డాడు. క్షణికావేశంతో కుర్చీతో కొట్టి.. బండరాయితో తల, చాతి, పొట్టపై దాడిచేసి పారిపోయాడు. స్థానికులు ఆమెను 108 అంబులెన్స్​లో బోధన్​ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సాయవ్వ చెల్లెలి కొడుకు జట్టి మహేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

    More like this

    Health Tips | వంటింట్లో ఆరోగ్యం .. ఇవి తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Health Tips | జ్ఞాపకశక్తిని పెంపొందించడం, మనస్సును పదునుగా ఉంచేవి ఎన్నో మన వంట...

    September 11 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 11 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగంతేదీ (DATE) – సెప్టెంబరు 11,​ 2025 పంచాంగంశ్రీ విశ్వావసు...

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...