BJYM Nizamabad | ఎందరో గొప్పవ్యక్తుల కృషితో సోమనాథ్​ ఆలయం పునర్మిర్మాణం

అక్షరటుడే, ఇందూరు: BJYM Nizamabad | ఎందరో గొప్పవ్యక్తుల కృషితో సోమనాథ్​ ఆలయం పునర్మిర్మాణం జరిగిందని బీజేవైఎం (BJYM) రాష్ట్ర నాయకుడు పల్నాటి కార్తీక్​ పేర్కొన్నారు. ఈ మేరకు నగరంలోని కోటగల్లీలో భక్త మార్కండేయ ఆలయంలో బీజేవైఎం ఆధ్వర్యంలో ఆలయ శుద్ధి, శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. BJYM Nizamabad | గజిని మహమ్మద్​ దాడిలో.. భారతీయ చరిత్రలో అత్యంత పవిత్రమైన సోమనాథ్ పుణ్యక్షేత్రంపై 1026 జనవరిలో గజిని మహమ్మద్ చేసిన క్రూరమైన దాడికి వెయ్యేళ్లు అయ్యిందని […]

అక్షరటుడే, ఇందూరు: BJYM Nizamabad | ఎందరో గొప్పవ్యక్తుల కృషితో సోమనాథ్​ ఆలయం పునర్మిర్మాణం జరిగిందని బీజేవైఎం (BJYM) రాష్ట్ర నాయకుడు పల్నాటి కార్తీక్​ పేర్కొన్నారు. ఈ మేరకు నగరంలోని కోటగల్లీలో భక్త మార్కండేయ ఆలయంలో బీజేవైఎం ఆధ్వర్యంలో ఆలయ శుద్ధి, శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

BJYM Nizamabad | గజిని మహమ్మద్​ దాడిలో..

భారతీయ చరిత్రలో అత్యంత పవిత్రమైన సోమనాథ్ పుణ్యక్షేత్రంపై 1026 జనవరిలో గజిని మహమ్మద్ చేసిన క్రూరమైన దాడికి వెయ్యేళ్లు అయ్యిందని కార్తీక్​ అన్నారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) పిలుపుమేరకు నిజామాబాద్ నగరంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఆనాడు విదేశీ ఆక్రమణదారులు సోమనాథ్ ఆలయాన్ని ధ్వంసం చేసినప్పటికీ ఎందరో మహానుభావుల కృషి ఫలితంగా నేడు ఆ క్షేత్రం అత్యంత వైభవంగా వెలుగొందుతోందన్నారు.

BJYM Nizamabad | 75ఏళ్లు పూర్తయిన సందర్భంగా..

ఆలయ పునరుద్ధరణ జరిగి 2026 నాటికి 75 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో మన చారిత్రక కట్టడాలను, సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత నేటి యువతపై ఉందని కార్తీక్​ పేర్కొన్నారు. కోటగల్లిలోని మార్కండేయ ఆలయ ప్రాంగణాన్ని కాలనీవాసులతో కలిసి శుద్ధి చేసిన అనంతరం, స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. సనాతన ధర్మంపై అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు స్ఫూర్తినిస్తాయని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక మండల అధ్యక్షుడు ఇప్పకాయల కిషోర్, ప్రధాన కార్యదర్శి దోర్నాల రవి, వాసం జయ, బల్ల లక్ష్మి, పల్నాటి శ్రీలక్ష్మి, కార్యకర్తలు, కాలనీ ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

Related articles

Saudi Poultry Import Ban | సౌదీ కీలక నిర్ణయం.. భారత్​ నుంచి కోళ్లు, గుడ్ల దిగుమతిపై నిషేధం

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Saudi Poultry Import Ban | సౌదీ అరేబియా (Saudi Arabia) కీలక నిర్ణయం తీసుకుంది. భారత్​ సహా 40 దేశాల...

Odisha Mines Officer Bribery | లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్​ అధికారి.. ఇంట్లో రూ.4 కోట్లు సీజ్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Odisha Mines Officer Bribery | ఒడిశాలోని ప్రభుత్వ అధికారి ఇంట్లో నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా...

Private Hospital Case | ప్రైవేట్​ ఆస్పత్రిలో యువకుడి అనుమానాస్పద మృతి.. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటున్న బాధితులు

నగరంలో ప్రైవేట్​ ఆస్పత్రిలో ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఆస్పత్రిలో మత్తు వైద్యుల నిర్లక్ష్యంగానే ఈ ఘటన జరిగిందని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు.

IFS Mains Results 2025 | ఇండియన్​ ఫారెస్ట్​ సర్వీస్​ మెయిన్స్​ ఫలితాలు విడుదల

అక్షరటుడే, వెబ్​డెస్క్ : IFS Mains Results 2025 | ఇండియన్​ ఫారెస్ట్​ సర్వీస్ (Indian Forest Service) మెయిన్స్​​ ఫలితాలను యూపీఎస్సీ విడుదల...