HomeతెలంగాణMP Aravind | పార్టీ అన్నాక కొన్ని నడుస్తూ ఉంటాయి.. ఎంపీ అర్వింద్​ కీలక వ్యాఖ్యలు

MP Aravind | పార్టీ అన్నాక కొన్ని నడుస్తూ ఉంటాయి.. ఎంపీ అర్వింద్​ కీలక వ్యాఖ్యలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: MP Aravind | బీజేపీలో ఇటీవల బండి సంజయ్ ​(Bandi Sanjay), ఈటల రాజేందర్ (Eatala Rajender)​ మధ్య వార్​ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్​ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్​ సమావేశాల్లో భాగంగా ఢిల్లీలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ అన్నాక కొన్ని నడుస్తూ ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఇది మొదటిది కాదని.. అలాగే చివరిది కాదని పేర్కొన్నారు.

బీజేపీ నూతన అధ్యక్షుడు రామచందర్​ రావు (Ramachandra Rao), పాత అధ్యక్షుడు కిషన్​రెడ్డి (Kishan Reddy) కలిసి మాట్లాడుకోవాలన్నారు. అవసరం అయితే ఈ విషయమై ఇన్​ఛార్జి జనరల్ సెక్రెటరీ చూసుకోవాలన్నారు. ఈ విషయాన్ని దూరం పోనియొద్దని ఆయన సూచించారు. ఏ పార్టీలో అయినా ఇలాంటివి సహజం అని పేర్కొన్నారు.

MP Aravind | రాజాసింగ్​ ఎక్కడున్నా గౌరవిస్తాం

గోషామహల్​ ఎమ్మెల్యే రాజాసింగ్​ (Goshamahal MLA Raja Singh) ఎక్కడున్నా ఆయనను తాము గౌరవిస్తామని ఎంపీ అర్వింద్ (MP Dharmapuri Arvind)​ అన్నారు. ఆయన రాజకీయ నాయకుడి కంటే.. సిద్ధాంతపరమైన నాయకుడు అని పేర్కొన్నారు. రాజాసింగ్​ పార్టీకి రాజీనామా చేశారన్నారు. పార్టీలో ఎవరైనా రాజీనామా చేస్తే.. సభ్యత్వ నమోదు కోసం మిస్​ కాల్​ ఇస్తే మళ్లీ పార్టీ మెంబర్​ అవుతారని ఆయన గుర్తు చేశారు. కొన్ని విషయాల్లో మనస్తాపం చెంది రాజాసింగ్​ రిజైన్​ చేశారన్నారు.