Homeజిల్లాలునిజామాబాద్​TGSRTC | నడుస్తున్న ఆర్టీసీ బస్సులో పొగలు

TGSRTC | నడుస్తున్న ఆర్టీసీ బస్సులో పొగలు

- Advertisement -

అక్షరటుడే, డిచ్​పల్లి: TGSRTC | ఆర్టీసీలో ప్రవేశపెట్టిన ఎలక్ట్రికల్​ బస్సుల్లో కొన్ని అప్పుడప్పుడు మొరాయిస్తున్నాయి. పలుమార్లు మార్గమధ్యలో నిలిచిపోతుండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కాగా.. తాజాగా ఎలక్ట్రికల్​ బస్సులో పొగలు రాగా.. పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన డిచ్​పల్లి మండలం ధర్మారం(బి)లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్​ నుంచి నిజామాబాద్​ వైపు వస్తున్న ఎలక్ట్రికల్​ బస్సు ధర్మారం గ్రామానికి రాగానే ఒక్కసారిగా పొగలు వచ్చాయి. బ్యాటరీ నుంచి కాలిపోయిన వాసన వస్తుండడంతో గమనించిన డ్రైవర్​ వెంటనే బస్సును నిలిపివేశాడు. బ్యాటరీని వెంటనే చల్లార్చడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.