అక్షరటుడే, మెండోరా : Sriram Sagar | శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్కు ఎగువ నుంచి స్వల్ప ఇన్ఫ్లో వస్తోంది. దీంతో అధికారులు ఎస్కేప్ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
జలాశయానికి ఇటీవల వరద తగ్గడంతో అధికారులు వరద గేట్లతో పాటు ఎస్కేప్ గేట్లను మూసివేశారు. ప్రస్తుతం 9,654 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండటంతో ఆదివారం ఉదయం 10 గంటలకు ఎస్కేప్ గేట్ల ద్వారా గోదావరిలోకి (Godavari) నీటి విడుదలను ప్రారంభించారు. నదిలోకి నీటిని వదులుతుండటంతో పరీవాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రాజెక్ట్ (Sriram Sagar Project) నుంచి ప్రస్తుతం కాకతీయ కాలువకు 5 వేల క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 3 వేలు, సరస్వతి కాలువకు 650, లక్ష్మి కాలువకు 200 క్యూసెక్కులు వదులుతున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టంతో నిండుకుండలా ఉంది.
నిజాంసాగర్ ప్రాజెక్ట్లోకి..
అక్షరటుడే, ఎల్లారెడ్డి: నిజాంసాగర్ ప్రాజెక్ట్లోకి (Nizam Sagar Project) ఎగువ ప్రాంతం నుంచి వరద వస్తోంది. దీంతో ఆదివారం మధ్యాహ్నం 12:30 గంటలకు 12 వరద గేట్లు ఎత్తుతామని అధికారులు తెలిపారు. దిగవకు 4 వేల క్యూసెక్కులు విడుదల చేస్తామని మంజీర పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. నదిలో చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.