Homeజిల్లాలుకామారెడ్డిSriram Sagar | ప్రాజెక్ట్​లకు కొనసాగుతున్న స్వల్ప ఇన్​ఫ్లో

Sriram Sagar | ప్రాజెక్ట్​లకు కొనసాగుతున్న స్వల్ప ఇన్​ఫ్లో

ఉమ్మడి జిల్లాలోని శ్రీరామ్​ సాగర్​, నిజాంసాగర్​ ప్రాజెక్ట్​లకు ఎగువ నుంచి స్వల్పంగా వరద వస్తోంది. ఎస్సారెస్పీ ఎస్కేప్​ గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

- Advertisement -

అక్షరటుడే, మెండోరా : Sriram Sagar | శ్రీరామ్​ సాగర్​ ప్రాజెక్ట్​కు ఎగువ నుంచి స్వల్ప ఇన్​ఫ్లో వస్తోంది. దీంతో అధికారులు ఎస్కేప్​ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

జలాశయానికి ఇటీవల వరద తగ్గడంతో అధికారులు వరద గేట్లతో పాటు ఎస్కేప్​ గేట్లను మూసివేశారు. ప్రస్తుతం 9,654 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తుండటంతో ఆదివారం ఉదయం 10 గంటలకు ఎస్కేప్ గేట్ల ద్వారా గోదావరిలోకి (Godavari) నీటి విడుదలను ప్రారంభించారు. నదిలోకి నీటిని వదులుతుండటంతో పరీవాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రాజెక్ట్​ (Sriram Sagar Project) నుంచి ప్రస్తుతం కాకతీయ కాలువకు 5 వేల క్యూసెక్కులు, ఎస్కేప్​ గేట్ల ద్వారా 3 వేలు, సరస్వతి కాలువకు 650, లక్ష్మి కాలువకు 200 క్యూసెక్కులు వదులుతున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టంతో నిండుకుండలా ఉంది.

నిజాంసాగర్ ప్రాజెక్ట్​లోకి..

అక్షరటుడే, ఎల్లారెడ్డి: నిజాంసాగర్ ప్రాజెక్ట్​లోకి (Nizam Sagar Project) ఎగువ ప్రాంతం నుంచి వరద వస్తోంది. దీంతో ఆదివారం మధ్యాహ్నం 12:30 గంటలకు 12 వరద గేట్లు ఎత్తుతామని అధికారులు తెలిపారు. దిగవకు 4 వేల క్యూసెక్కులు విడుదల చేస్తామని మంజీర పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. నదిలో చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.