అక్షరటుడే,ఆర్మూర్: Sriramsagar Project | రెండుమూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి స్వల్ప ఇన్ఫ్లో (Inflow of Sriram Sagar) వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 80.5 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్ట్లో 12.672 టీఎంసీల నీరు ఉంది.
గతేడాది ఇదే సమయానికి 7.410 టీఎంసీలుగా ఉంది. 15రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో నిజామాబాద్ (Nizamabad), నిర్మల్ (Nirmal) జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రాజెక్ట్లోకి 2,315 స్వల్ప ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది.
ఆవిరి రూపంలో 341 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. గతేడాది యాసంగికి ప్రాజెక్టు పరిధిలోని 6 లక్షల ఎకరాలకు 62 టీఎంసీల నీటిని అందించారు. ఈ ఏడాది సైతం ప్రాజెక్ట్లోకి 60టీఎంసీల నీటీనిల్వ అనంతరం ఖరీఫ్కు నీటి విడుదలపై అధికారులు సమాలోచన చేయనున్నారు.