ePaper
More
    HomeతెలంగాణHyderabad | పాడుబడ్డ ఇంట్లో అస్థిపంజరం కలకలం

    Hyderabad | పాడుబడ్డ ఇంట్లో అస్థిపంజరం కలకలం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్​లోని ఓ పాడుబడ్డ ఇంట్లో అస్థి పంజరం ఉండడం కలకలం రేపింది. ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర చర్చకు దారి తీసింది. సోషల్​ మీడియాలో (Social Media) ఫేమస్​ కావడానికి ఇటీవల కొందరు రకరకాల వీడియోలు తీసి పోస్ట్​ చేస్తున్న విషయం తెలిసిందే.

    ఇందులో భాగంగా ఓ యువకుడు మీకు ఒకటి చూపిస్తానంటూ పాడుబడ్డ ఇంట్లోకి వెళ్లి వీడియో తీశాడు. అస్థిపంజరం చూపిస్తూ వీడియో తీసి సోషల్​ మీడియాలో పోస్ట్​ చేశాడు. ఆ వీడియో వైరల్​ కావడంతో పోలీసులు రంగం ప్రవేశం చేశారు.

    హైదరాబాద్​లోని హబీబ్​నగర్​ పోలీస్​ స్టేషన్​ (Habibnagar Police Station) పరిధిలోని నాంపల్లిలోని ఓ ఇంట్లో అస్థి పంజరం బయట పడింది. నాంపల్లి మార్కెట్ ప్రాంతంలోని ఓ పాడుబడ్డ ఇంట్లో దానిని చూసిన యువకుడు సోషల్​ మీడియాలో వీడియో పెట్టాడు. దీంతో పోలీసులు సదరు యువకుడిని స్టేషన్​కు పిలిపించి విచారించారు. దాదాపు ఏడేళ్లుగా ఆ ఇంట్లో ఎవరూ లేరని, ఇంటి ఓనర్ విదేశాలలో ఉన్నట్లు స్థానికులు తెలిపారు. అయితే ఆ అస్థిపంజరం ఎవరిది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొన్నేళ్లుగా ఇల్లు పాడుబడి ఉండడంతో హత్య చేసి పాతిపెట్టి ఉంటారని తెలుస్తోంది.

    More like this

    Kammarpalli | ఆదర్శంగా నిలుస్తున్న ఎస్సై అనిల్ రెడ్డి

    అక్షరటుడే, కమ్మర్​పల్లి : Kammarpalli | కమ్మర్​పల్లి ఎస్సై అనిల్ రెడ్డి (SI Anil Reddy) ప్రత్యేకత చాటుకుంటున్నారు....

    Bodhan Traffic Police | బోధన్ ట్రాఫిక్ పోలీసుల సేవలకు హ్యాట్సాఫ్​

    అక్షరటుడే, బోధన్ : Bodhan Traffic Police | బోధన్ పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు (traffic police) చేపడుతున్న...

    Ramareddy mandal | యూరియా కోసం రైతుల బారులు

    అక్షరటుడే, కామారెడ్డి: Ramareddy mandal | రామారెడ్డి మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయం (society office) వద్ద యూరియా...