Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad City | డ్రంకన్​ డ్రైవ్​ కేసులో ఆరుగురికి జైలుశిక్ష

Nizamabad City | డ్రంకన్​ డ్రైవ్​ కేసులో ఆరుగురికి జైలుశిక్ష

మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. డ్రంకన్​ డ్రైవ్​ కేసులో పట్టుబడిన వారిని కోర్టులో హాజరు పరుస్తున్నారు. కోర్టులు వారికి జైలుశిక్షతో పాటు భారీ జరిమానా విధిస్తున్నాయి.

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad City | మద్యం తాగి (drunk driving) వాహనాలు నడుపుతున్న వారికి పోలీసులు షాక్​ ఇస్తున్నారు. నిత్యం తనిఖీలు చేపడుతూ వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

డ్రంకన్​ డ్రైవ్​లో పట్టుబడిన ఆరుగురికి కోర్టు జైలు శిక్ష విధించినట్లు ట్రాఫిక్​ సీఐ ప్రసాద్​ (Traffic CI Prasad) తెలిపారు. మరో 14 మందికి భారీ జరిమానా విధించినట్లు వివరించారు. మద్యం తాగి వాహనాలు నడిపిన 20 మందికి ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ (Traffic ACP Mastan Ali) ఆదేశాల మేరకు మంగళవారం కౌన్సెలింగ్​ నిర్వహించామన్నారు. అనంతరం సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ నూర్జాన్ ఎదుట హాజరు పరిచినట్లు ఆయన తెలిపారు. కోర్టు ఆరుగురికి వారం రోజుల చొప్పున జైలు శిక్ష విధించింది. మరో 14 మంది నిందితులకు మొత్తం రూ.1,41,000 వేల జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు.