అక్షరటుడే, కామారెడ్డి: Drunk drive | ప్రమాదాల నివారణకు పోలీసు శాఖ పకడ్బందీ చర్యలు తీసుకుంటుంది. ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) ఆదేశాలతో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ప్రతిరోజు పదుల సంఖ్యలో వాహనదారులు మద్యం తాగి పోలీసులకు చిక్కుతున్నారు. వారిని కోర్టులో హాజరు పర్చగా కోర్టు వారికి జరిమానాలు, జైలు (fines and jail) శిక్షలు విధిస్తోంది.
తాజాగా జిల్లావ్యాప్తంగా డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో (drunk driving cases) పట్టుబడిన 43 మందికి కోర్టు శిక్షలు విధించింది. ఇందులో కామారెడ్డి పరిధిలో ఇద్దరికి, మచారెడ్డి, దోమకొండ పరిధిలో ఒక్కొక్కరికి, తాడ్వాయి పరిధిలో ఇద్దరికి ఒక రోజు జైలుశిక్షతో పాటు రూ. 1,000 జరిమానా విధించింది. అలాగే మిగితా 37మందికి రూ.1,000 చొప్పున రూ. 37వేల జరిమానా విధించింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. మద్యం తాగి డ్రైవ్ చేస్తే జైలు, జరిమానా తప్పదని హెచ్చరించారు. వాహనదారులు జాగ్రత్తలు పాటించి సురక్షితంగా ఇంటికి చేరాలని సూచించారు.