అక్షరటుడే, కోటగిరి: Pothangal | పోతంగల్ మండలంలోని పీఎస్ఆర్ నగర్ వద్ద యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ (Young India Integrated School) మంజూరైన విషయం విదితమే.
రూ.200 కోట్లతో నిర్మించనున్న ఈ స్కూల్ కోసం బుధవారం సాయంత్రం టీఎస్ఈడబ్ల్యూ ఐడీసీ సూపరింటెండెంట్ ఇంజినీర్ రవీందర్ అధికారులతో కలిసి పరిశీలించారు. స్కూల్ నిర్మించబోయే స్థలం బౌండరీలను పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలో స్కూల్ నిర్మాణానికి (School construction) శ్రీకారం చుట్టనున్నట్టు పేర్కొన్నారు.
స్కూల్ భవనాన్ని నాలుగు బ్లాక్లుగా విభజించనున్నట్లు తెలిపారు. సీనియర్, జూనియర్లకు హాస్టళ్లు, డైనింగ్ హాళ్లు, స్టాఫ్ క్వార్టర్స్, ప్రిన్సిపల్ క్వార్టర్స్ ఉంటాయన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ స్కూళ్లు ఉంటాయని పేర్కొన్నారు. స్థల పరిశీలనలో ఈఈ ప్రతాప్, డీఈ రవి, తహశీల్దార్ గంగాధర్, సర్వేయర్ పోశెట్టి, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు పుప్పాల శంకర్, ఎజాజ్ ఖాన్, గంగాధర్, రమేష్ సెట్, శ్రీనివాస్, రాజేందర్ గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

