అక్షరటుడే, వెబ్డెస్క్ : ACB Trap | మరో అవినీతి తిమింగలం ఏసీబీకి చిక్కింది. లంచం తీసుకుంటుండగా సైట్ ఇంజినీర్ను ఏసీబీ అధికారులు గురువారం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
అవినీతి అధికారులు మారడం లేదు. ఏసీబీ అధికారులు(ACB Officers) కేసులు నమోదు చేస్తున్నా లంచాలకు మరిగిన వారు భయపడటం లేదు. ప్రభుత్వ శాఖల్లో పని చేసే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సైతం అందినకాడికి దండుకుంటున్నారు. పైసలు ఇస్తేనే పనులు చేస్తున్నారు. తాజాగా జనగామ జిల్లా విద్యా సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (TGEWIDC)లో పనిచేస్తున్న సైట్ ఇంజినీర్ సామల రమేష్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
ACB Trap | బిల్లులు ప్రాసెస్ చేయడానికి.
సామల రమేష్ ఔట్ సోర్సింగ్ విధానంలో సైట్ ఇంజినీర్గా పని చేస్తున్నాడు. అయితే జిల్లాలో ప్రధానమంత్రి శ్రీ యోజన పథకం(PM Shri Yojana Scheme) కింద పాఠశాలల్లో పూర్తి చేసిన పనులకు బిల్లులు ప్రాసెస్ చేయాలని ఓ వ్యక్తి ఆయనను కలిశాడు. దీని కోసం రమేష్ రూ.18 వేల లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. సదరు సైట్ ఇంజినీర్ రూ.10 వేలు ముందుగానే తీసుకున్నాడు. మరో రూ.8 వేలు తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు సామల రమేష్ను గురువారం పట్టుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
ACB Trap | లంచం అడిగితే ఫోన్ చేయండి
ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీకి ఫోన్ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number), వాట్సాప్ నంబర్ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని భరోసా ఇస్తున్నారు. ఎంత మొత్తం లంచం అడిగినా.. వస్తు రూపంలో బహుమతులు అడిగినా తమకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, ఆ పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.