HomeతెలంగాణLand Grabbing | దర్జాగా శిఖం భూమి కబ్జా.. అధికార పార్టీ నేత నిర్వాకం

Land Grabbing | దర్జాగా శిఖం భూమి కబ్జా.. అధికార పార్టీ నేత నిర్వాకం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Land Grabbing | నిజామాబాద్​ జిల్లాలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. ప్రత్యేకించి శిఖం భూములను కొందరు తప్పుడు పత్రాలు సృష్టించి కాజేస్తున్నారు. రాత్రికిరాత్రి హద్దు రాళ్లు ఏర్పాటు చేసి ఆక్రమణలకు పాల్పడుతున్నారు. తాజాగా నిజామాబాద్​ నగరానికి చెందిన అధికార కాంగ్రెస్​ నేత(Congress Leader) భూ కబ్జా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సదరు భూమి విలువ రూ.20 కోట్ల వరకు ఉండటం గమనార్హం.

నిజామాబాద్​ నగర శివారులోని సారంగాపూర్ (Sarangapoor)​ సర్వే నంబర్​ 231లో ప్రభుత్వ, శిఖం భూమి ఉంది. ఈ భూమిపై మొన్నటి వరకు ఎవరికి ఎలాంటి హక్కులు లేవు. కానీ, తాజాగా అధికార పార్టీకి చెందిన నేత, మాజీ కార్పొరేటర్​ సదరు భూమిని కబ్జా (Land grabbing) చేశాడు. నకిలీ పత్రాలతో తన బినామీల ద్వారా సంబంధిత స్థలంలో వెంచర్​ పనులు మొదలు పెట్టాడు. హద్దు రాళ్లు పాతడమే కాకుండా ఏకంగా అమ్మకాలు కూడా ప్రారంభించడం గమనార్హం. ఇంత జరగుతున్నా రెవెన్యూ అధికారులు (Revenue officers) అటువైపు కన్నెత్తి చూడటం లేదు. ఈ భూమి విలువ రూ.20 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.

Land Grabbing | ఆది నుంచి వివాదాస్పదమే..

అధికార కాంగ్రెస్​(Congress)లో కొనసాగుతున్న సదరు మాజీ కార్పొరేటర్​ తీరు ఆది నుంచి వివాదాస్పదమే. భూ కబ్జాలు చేయడం, అక్రమ మొరం తవ్వకాలు జరపడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. గత బీఆర్​ఎస్(BRS)​ ప్రభుత్వ హయాంలోనూ అతగాడు పలుచోట్ల భూములు ఆక్రమించాడు. అక్రమ మొరం తవ్వకాల వ్యవహారంలో కేసు నమోదు కావడంతో ఓ పార్టీ(suspended from party) నుంచి సస్పెండ్​ అయ్యాడు. తీరా అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్​లో చేరిన సదరు నేత తమ పార్టీ అధికారంలోకి రావడంతో అడ్డూఅదుపు లేకుండా వ్యవహరిస్తున్నాడు. తన బినామీల ద్వారా తిరిగి కబ్జాలు మొదలు పెట్టాడు.

Land Grabbing | కలెక్టర్​కు ఫిర్యాదు

సారంగాపూర్​ శివారులోని సర్వే నంబర్​ 231లో జరుగుతున్న భూకబ్జా వ్యవహారంపై ఎంఐఎం నాయకులు(MIM Leaders) స్పందించారు. ఈ విషయమై సత్వరమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్​ చేశారు. ఎంఐఎం అధ్యక్షుడు ఫయాజ్(MIM president Fayaz)​ ఆధ్వర్యంలో కలెక్టర్​ రాజీవ్​గాంధీ హనుమంతు(Collector Rajiv Gandhi Hanumanthu)ను మంగళవారం కలిసి ఫిర్యాదు చేశారు. కోట్ల రూపాయలు విలువ చేసే శిఖం భూమిని అధికార పార్టీకి చెందిన ఓ నేత కబ్జా చేస్తున్నారని కలెక్టర్​ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే సర్వే జరిపించి సదరు భూమిని కాపాడాలని వారు విన్నవించారు. కాగా.. ఆర్డీవోతో విచారణ చేయించి సర్వే జరిపిస్తామని కలెక్టర్​ హామీ ఇచ్చినట్లు సమాచారం.