అక్షరటుడే, కామారెడ్డి: Si transfers | కామారెడ్డి జిల్లాలో శనివారం పలువురు ఎస్సైలను బదిలీ చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. గత కొంతకాలంగా వీఆర్లో ఉన్న పోలీసులకు ఎట్టకేలకు పోస్టింగ్ లభించింది.
వీఆర్లో ఉన్న ఎస్సై మహేందర్ను బీర్కూర్ బదిలీ చేశారు. ప్రకాశ్ను బాన్సువాడ టౌన్కు పంపించారు. వీకే రాములుకు బాన్సువాడ టౌన్కు పోస్టింగ్ ఇచ్చారు. బీర్కూర్లో పని చేస్తున్న రాజశేఖర్ను కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. కామారెడ్డి కోర్టులో విధులు నిర్వర్తిస్తున్న రాజయ్యను డీఏఆర్కు అటాచ్ చేశారు. డీఏఆర్లో ఉన్న దత్తాద్రి గౌడ్ను దేవునిపల్లికి బదిలీ చేశారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని పేర్కొన్నారు. కాగా.. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తొమ్మిది ఎస్సైలను సైతం బదిలీ చేసిన విషయం తెలిసిందే.