అక్షరటుడే, వెబ్డెస్క్ : Urea Problems | యూరియా కొరతతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం సొసైటీలు, ఎరువుల దుకాణాల చుట్టూ తిరుగుతున్నారు.
యూరియా ఏదని అధికారులను నిలదీస్తున్నారు. ఈ క్రమంలో యూరియా కోసం ప్రశ్నించిన ఓ రైతును ఎస్సై(SI) చెంపపై కొట్టాడు. ఈ ఘటన నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేరులో చోటు చేసుకుంది. శనివారం ఉదయం రైతులు యూరియా కోసం బారులు తీరారు. ఈ క్రమంలో అక్కడకు వచ్చిన ఎస్సైని రైతులు(Farmers) ప్రశ్నించారు. దీంతో ఆగ్రహానికి గురైన ఆయన ఓ రైతు చెంపపై కొట్టారు. ఎస్సై తీరుపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Urea Problems | యూరియా కోసం తిప్పలు
ప్రస్తుతం వరి పొలాలు పొట్ట దశలో ఉన్నాయి. ఇప్పుడు యూరియా వేయకపోతే దిగుబడిపై ప్రభావం చూపుతోంది. దీంతో రైతులు యూరియా బస్తాల కోసం తిప్పలు పడుతున్నారు. నిత్యం తెల్లవారుజామున నుంచే సొసైటీల వద్ద బారులు తీరుతున్నారు. ఇంటిల్లాపాది పనులు మానుకొని యూరియా కోసం లైన్లలో నిల్చుంటున్నారు.
Urea Problems | కమిషనర్ను కలిసిన బీఆర్ఎస్ నేతలు
బీఆర్ఎస్ నేతలు శనివారం అగ్రికల్చర్ కమిషనర్(Agriculture Commissioner)ను కలిశారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో యూరియా కోసం వెళ్తే రైతులను కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ ఎస్సై రైతును చెంపపై కొట్టాడని ఆవేదన వ్యక్తం చేశారు. గత పదేళ్లలో రాని యూరియా కొరత(Urea Shortage) ఇప్పుడు ఎందుకు వచ్చిందని ఆయన ప్రశ్నించారు.
Urea Problems | ప్రణాళిక లేకపోవడంతో..
సరైన ప్రాణాళిక లేకపోవడంతో యూరియా కొరత వచ్చిందని హరీశ్రావు(Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షంలో తడుస్తూ, అర్ధరాత్రులు ఎరువుల కోసం మహిళా రైతులు రోడ్ల మీద నిలబడి ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఇబ్బందులు పడకుండా సరిపడా యూరియా ఇవ్వాలని అగ్రికల్చర్ కమిషనర్ను కోరారు. అనంతరం కమిషనర్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. కాగా వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.
View this post on Instagram