HomeతెలంగాణHyderabad | మణికొండలో కాల్పుల కలకలం.. మాజీ డిప్యూటీ సీఎం సోదరుడిపై కేసు

Hyderabad | మణికొండలో కాల్పుల కలకలం.. మాజీ డిప్యూటీ సీఎం సోదరుడిపై కేసు

హైదరాబాద్​లో మరోసారి కాల్పులు ఘటన చోటు చేసుకుంది. భూ వివాదం నేపథ్యంలో మణికొండలో ఓ వ్యక్తి గాల్లోకి కాల్పులు జరిపాడు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్​లో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. ఓ భూ వివాదం నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో ఓ వ్యక్తి గాలిలోకి కాల్పులు జరిపాడు.

మణికొండ (Manikonda) పంచవటి కాలనీలో కాల్పులు చోటు చేసుకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కాగా కాల్పులు జరిపింది ఆంధ్రప్రదేశ్​ మాజీ ఉపముఖ్యమంత్రి  కృష్ణమూర్తి తమ్ముడు ప్రభాకర్‌గా గుర్తించారు. స్థలం ఖాళీ చేయాలని బెదిరించినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు బాధితులు రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ (Rayadurgam Police Station)లో ఫిర్యాదు చేశారు.

Hyderabad | అనుచరులతో బెదిరింపులు

మణికొండ పంచవటి కాలనీలో ఓ స్థలాన్నీ ఖాళీ చేయాలని ప్రభాకర్​ బాధితులను బెదిరించాడు. ఆయన అనుచరులు బాధితులను బయటకు గెంటేసీ గేటుకు తాళాలు వేశారు. ఈ క్రమంలో ఘర్షణ చోటు చేసుకోగా ప్రభాకర్​ గాలిలోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. బాధితుల ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Hyderabad | వరుస ఘటనలతో ఆందోళన

నగరంలో ఇటీవల కాల్పుల ఘటనలు వరుసగా చోటు చేసుకుంటుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత నెల 22న మేడ్చల్​ జిల్లా పోచారం (Pocharam)లో సోనూ సింగ్​ అనే వ్యక్తిపై ఇబ్రహీం కాల్పులు జరిపాడు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడగా స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అక్టోబర్​ 25న చాదర్​ఘట్​లోని విక్టోరీయా గ్రౌండ్​లో కాల్పులు చోటు చేసుకున్నాయి. పోలీసులపై సెల్​ఫోన్​ దొంగ కత్తితో దాడి చేయడానికి యత్నించాడు. దీంతో ఏసీపీ దొంగపై ఫైరింగ్​ చేశారు. అంతకు ముందు నిజామాబాద్ నగరంలో కానిస్టేబుల్​ను హత్య చేసిన రౌడీ షీటర్ రియాజ్​ను పోలీసులు ఎన్​కౌంటర్​ చేశారు. నల్గొండ జిల్లాలో గన్​తో బెదిరించి దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో కాల్పుల ఘటనలు చోటు చేసుకుంటుండం ఆందోళనకు గురి చేస్తుంది.