HomeUncategorizedEncounter | మావోయిస్టులకు షాక్​.. మరో కీలక నేత హతం

Encounter | మావోయిస్టులకు షాక్​.. మరో కీలక నేత హతం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Encounter | మావోయిస్టులకు మరో షాక్​ తగిలింది. ఆపరేషన్​ కగార్ (Operation Kagar)​లో భాగంగా చోటు చేసుకుంటున్న వరుస ఎన్​కౌంటర్లతో భారీగా మావోయిస్టులు మృతి చెందుతున్నారు. తాజాగా బుధవారం ఉదయం జార్ఖండ్‌ (Jharkhand)లోని బొకారో జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఎన్​కౌంటర్​ చోటు చేసుకుంది.

భద్రత బలగాలు మావోయిస్టుల కోసం సెర్చ్​ ఆపరేషన్​ (Search Operation) చేపట్టాయి. ఈ క్రమంలో కాల్పులు చోటు చేసుకోగా.. సబ్-జోనల్ నక్సల్ కమాండర్ కున్వర్ మాంఝీ అలియాస్ సహ్‌దియో మాంఝీ అలియాస్ సాడే మృతి చెందారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ 209 కోబ్రా యూనిట్, జార్ఖండ్ పోలీసులు (Jharkhand Police) ఈ ఆపరేషన్​లో పాల్గొన్నారు. ఘటన స్థలంలో బలగాలు ఒక ఏకే 47, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నాయి.

Encounter | వరుస ఎన్​కౌంటర్లు

దేశంలో 2026 మార్చి 31 నాటికి మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్​ షా(Amit Shah) ప్రకటించారు. ఈ వర్షాకాలంలో సైతం మావోలకు నిద్ర లేకుండా చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆపరేషన్​ కగరాను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. వేల సంఖ్యలో బలగాలు అడవులను జల్లెడ పడుతున్నాయి. మావోయిస్టులు ఉన్నారనే సమాచారం వస్తే చాలా కూంబింగ్​ (Coombing) నిర్వహిస్తున్నాయి.

ఈ క్రమంలో వరుస ఎన్​కౌంటర్లు (Encounter) చోటు చేసుకుంటుండగా.. భారీ సంఖ్యలో మావోలు కేడర్​ను కోల్పోతున్నారు. మరోవైపు కీలక నేతలు సైతం హతం అవుతుండడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఆపరేషన్​ కగార్​ ఆపాలని, తాము శాంతి చర్చలకు సిద్ధమని వారు ప్రకటించారు. అయితే కేంద్ర ప్రభుత్వం (Central Government) మాత్రం చర్చలు లేవని స్పష్టం చేసింది. ఆయుధాలు వీడి లొంగిపోవడం ఒక్కటే మావోలకు ఉన్న మార్గమని తేల్చి చెప్పింది. ఈ క్రమంలో పలువురు మావోయిస్టులు లొంగిపోతున్నారు.

Must Read
Related News