Virat Kohli
Virat Kohli | విరాట్ కోహ్లీకి షాక్​.. పబ్​పై కేసు నమోదు చేసిన పోలీసులు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Virat Kohli | విరాట్​ కోహ్లీకి బెంగళూరు పోలీసులు(Bangalore Police) షాక్​ ఇచ్చారు. క్రికెట్​లో పరుగుల వరద పారించి ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్న విరాట్​ కోహ్లీ రెస్టారెంట్​ అండ్​ పబ్(Restaurant and Pub)​ వ్యాపారం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. బెంగళూరులోని కస్తూర్బా రోడ్డులో వన్8 కమ్యూన్ పబ్​ అండ్​ రెస్టారెంట్​ను కోహ్లీ నిర్వహిస్తున్నాడు. తాజాగా పోలీసులు ఈ పబ్​పై కేసు నమోదు చేశారు. రెస్టారెంట్లో స్మోకింగ్ ఏరియా(Smoking Area) లేదని ‘కోట్పా’ చట్టం కింద కేసు పెట్టారు.

పోలీసులు పబ్​లో ఆకస్మికంగా తనిఖీ చేశారు. అయితే స్మోకింగ్​ చేసే వారికి పబ్​లో ప్రత్యేకంగా స్థలం కేటాయించలేదు. దీంతో పబ్​లో పొగ తాగుతున్నారు. ఇది సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం (COTPA) నిబంధనలకు విరుద్ధం కావడంతో పోలీసులు కేసు నమోదు(Police case register) చేశారు. మరోవైపు కింగ్​ కోహ్లీ ఈ ఐపీఎల్​ సీజన్(IPL Season)​లో పరుగుల వరద పారించాడు. ఆర్సీబీ జట్టు ఈ సారి ఎలాగైనా కప్పు కొట్టాలనే కసితో ఉంది. 18 ఏళ్ల నిరీక్షణకు తెర దించుతూ బెంగళూరుకు కప్పు అందించాలని కోహ్లీ కలలు కంటున్నాడు. ఈ మేరకు ఆ జట్టు ఆల్​రెడీ ఐపీఎల్​ ఫైనల్(IPL Final)​కు దూసుకెళ్లింది. మంగళవారం ఆ జట్టు పంజాబ్​(Punjab)తో ఫైనల్​లో తల పడనుంది. కాగా క్వాలిఫైయర్​ –1లో పంజాబ్​ కింగ్స్​ జట్టును చిత్తు చేసిన ఆర్సీబీ(RCB) ఊపు మీద ఉంది. మరోవైపు క్వాలిఫైయర్​–2లో ముంబైని ఓడించిన పంజాబ్​ సైతం ఈ సారి ఎలాగైనా కప్పు కొట్టాలని చూస్తోంది.