ePaper
More
    HomeజాతీయంHaryana | ప్రాణం తీసి.. పారిపోయిందని చెప్పారు

    Haryana | ప్రాణం తీసి.. పారిపోయిందని చెప్పారు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Haryana | ఓ వివాహితను అత్తింటి వారు హత్య చేశారు. ఇంటి ఆవరణలోనే ఆమెను పూడ్చి పెట్టి.. ఇంట్లో నుంచి పారిపోయిందని ప్రచారం చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు(Haryana Police) ఆమె మృతదేహాన్ని వెలికితీసి ఆమె అత్తింటివారిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన హర్యానాలో చోటు చేసుకుంది.

    హర్యానాలోని ఫరీదాబాద్‌(Faridabad)కు చెందిన తను కుమార్​ రెండేళ్ల క్రితం అరుణ్ సింగ్‌ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. అయితే పెళ్లయిన నాటి నుంచే ఆమెను అత్తమామలు కట్నం కోసం వేధించడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో రెండు నెలలుగా ఆమె కనిపించడం లేదు. ఆమెను ఏప్రిల్​ 23న హత్య చేశారు. ఇంటి ముందు గుంత తవ్వి అందులో పూడ్చి పెట్టారు. అంతేగాకుండా ఆమె ఇంట్లో నుంచి పారిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    Haryana | తండ్రి ఫిర్యాదుతో..

    తను కుమార్​ పారిపోయిందని చెప్పడంతో ఆమె తండ్రి హకీమ్​ వారింటికి వెళ్లి పరిశీలించారు. తన కూతురిని వారే ఏదో చేసి ఉంటారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన పోలీసులు శుక్రవారం తను కుమార్​ అత్తవారింట్లో ఆమె మృతదేహాన్ని(Dead Body) వెలికి తీశారు. కుమార్​ భర్త అరుణ్​ అత్తమామలు, వదినను విచారణ కోసం అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...