Bodhan
Bodhan | వర్షం ఎఫెక్ట్​.. నిండిన షర్బత్​ కెనాల్​.. మరమ్మతులు చేపట్టిన అధికారులు

అక్షరటుడే, బోధన్: Bodhan | జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. దీంతో వరద నీరు కాల్వలు, వాగులు, చెరువుల్లోకి వచ్చి చేరుతోంది. కాగా.. వర్షం కారణంగా బోధన్​ పట్టణంలోని షర్బత్​ కెనాల్​ పూర్తిగా వరద నీటితో నిండిపోయింది. ఈ నీళ్లు బస్టాండ్​ ప్రాంతం వరకు వచ్చేశాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాలువలో చెత్తాచెదారం ఇరుక్కుపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో అధికారులు కాలువ క్లియర్​ చేసే పనులు చేపట్టారు.

ఈ పనులను బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో శనివారం దగ్గరుండి పరిశీలిస్తున్నారు. వర్షాలతో ప్రజలు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకూడదని షర్బత్ కెనాల్​లో పేరుకుపోయిన చెత్తను క్లియర్ చేసి నీటి ప్రవాహం సక్రమంగా జరిగేలా చూడాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ కృష్ణ జాదవ్ కూడా ఉన్నారు.