HomeతెలంగాణSFI Bandh | ఫీజు బకాయిల కోసం.. రేపు ఎస్​ఎఫ్​ఐ కాలేజీల బంద్​

SFI Bandh | ఫీజు బకాయిల కోసం.. రేపు ఎస్​ఎఫ్​ఐ కాలేజీల బంద్​

ఫీజు రీయింబర్స్​మెంట్​ బకాయిల కోసం ఎస్​ఎఫ్​ఐ గురువారం కాలేజీల బంద్​కు పిలుపునిచ్చింది. వెంటనే బకాయిలు విడుదల చేయాలని నాయకులు డిమాండ్​ చేశారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : SFI Bandh | రాష్ట్రంలో పెండింగ్​లో ఉన్న ఫీజు రీయింబర్స్​మెంట్ (Fee reimbursement) , స్కాలర్​షిప్ (Scholarship)​ బకాయిలను విడుదల చేయాలని ఎస్​ఎఫ్​ఐ నాయకులు డిమాండ్​ చేశారు. బకాయిల విడుదలలో ప్రభుత్వ తీరుకు నిరసనగా.. గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్నత, ప్రొఫెషనల్​ విద్యా సంస్థల బంద్​కు పిలుపునిచ్చారు.

ఎస్​ఎఫ్​ఐ పిలుపు నేపథ్యంలో ఇప్పటికే పలు ప్రైవేట్​ కాలేజీలు సెలవు ప్రకటించినట్లు తెలుస్తోంది. మరోవైపు మొంథా తుఫాన్ (Cyclone Montha) ప్రభావంతో​ మధ్య తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాల్లో విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. వరంగల్‌, హన్మకొండ జిల్లాలకు మరో 24 గంటలు అధికారులు రెడ్‌ అలర్ట్ జారీ చేశారు. దీంతో ఆ జిల్లాల కలెక్టర్లు గురువారం విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రావొద్దని అధికారుల సూచించారు. ములుగు జిల్లాలోని అన్ని విద్యా సంస్థలు, అంగన్వాడీ సెంటర్లకు కలెక్టర్ దివాకర్ సెలవు ప్రకటించారు.