అక్షరటుడే, పెద్దకొడప్గల్: PeddaKodapgal | విద్యుత్ వైర్లు తెగిపడి ఇళ్లపై పడగా ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. ఈ ఘటన పెద్దకొడప్గల్ మండల కేంద్రంలో (Peddakodapgal mandal center) మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కేంద్రంలోని కొత్త ప్లాట్ల ఏరియాలో మంగళవారం ఉదయం 11 కేవీ వైర్లు ఒక్కసారిగా తెగి ఇళ్లపై పడ్డాయి. అయితే ఆ సమయంలో జనాలు ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.
PeddaKodapgal | కాలనీవాసుల నిరసన
11కేవీ వైర్లతో ప్రమాదం పొంచి ఉందని తమ ఇళ్లపై నుంచి ఈ విద్యుత్ తీగలను తొలగించాలని పేర్కొంటూ కాలనీవాసులు గతంలోనూ విద్యుత్శాఖ అధికారులకు (electricity department officials) విన్నవించారు. అయినప్పటికీ వారు పెడచెవిన పెట్టారని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మండల కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద ధర్నాకు దిగారు.
విద్యుత్ వైర్లు తెగిపడిన సమయంలో ఎవరూ లేకపోవడం మంచిదైందని.. లేకపోతే ప్రాణాలు పోయేవని వారన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే తీగలను ఇళ్లపై నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై అరుణ్కుమార్ (SI Arun Kumar) కాలనీవాసులు ధర్నా చేస్తున్న గాంధీ చౌక్కు చేరుకున్నారు. సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తానని ఆయన హామీ ఇవ్వడంతో కాలనీవాసులు ధర్నా విరమించారు.
