HomeతెలంగాణTrains cancellation | భారీ వర్షాలతో పలు రైళ్లు రద్దు

Trains cancellation | భారీ వర్షాలతో పలు రైళ్లు రద్దు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Trains cancellation | రాష్ట్రంలో భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరదల ధాటికి చాలా చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. పలు చోట్ల రైల్వే ట్రాక్​లు (Railway tracks) సైతం ధ్వంసమయ్యాయి. దీంతో రైల్వే అధికారులు పలు రైళ్లను రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు.

కామారెడ్డి జిల్లాలోని (Kamareddy district) భిక్కనూరు–తలమడ్ల సెక్షన్​లో రైల్వే ట్రాక్​పై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. అక్కన్నపేట్ – మెదక్, గజ్వేల్ – లకుడారం, బోల్సా – ఖర్ఖేలి రైల్వే స్టేషన్ల మధ్య ఉన్న సెక్షన్లు వరదలతో ప్రభావితమయ్యాయి. దీంతో అధికారులు ఈ నెల 30న పూర్ణా–అకోలా, అకోలా–పార్లి వైజ్​నాథ్​, అకోలా–అకోట్​ మధ్య నడిచే 77608, 77609, 77610,77611, 77612, అకోలా– పూర్ణ మధ్య నడిచే రైళ్లను రద్దు చేశారు. 31న పార్లి వైజ్​నాథ్​–ఆదిలాబాద్​, ఆదిలాబాద్​–పూర్ణ, పూర్ణ–జల్నా, సెప్టెంబర్​ 1న జల్నా–నాగర్​సోల్​, నాగర్​సోల్​–జల్నా, జల్నా–నాందేడ్​ రైళ్లను రద్దు చేశారు.

వర్షాల నేపథ్యంలో ఆగస్టు 30న కాచిగూడ–నాగర్​సోల్​, నిజామాబాద్​–కాచిగూడ, నాందేడ్​–మేడ్చల్​, కాచిగూడ, కరీంనగర్​ (Karimnagar), కాచిగూడ–మెదక్, సికింద్రాబాద్​ – సిద్దిపేట, పండరిపూర్​–నిజామాబాద్ మధ్య నడిచే రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. 31న నాగర్​సోల్​–కాచిగూడ, మెదక్​–కాచిగూడ, సిద్దిపేట–సికింద్రాబాద్ మధ్య నడిచే రైళ్లను క్యాన్సిల్ చేశారు.

Trains cancellation | ప్రయాణికులు సహకరించాలి

రైళ్ల రద్దు నేపథ్యంలో ప్రయాణికులు సహకరించాలని రైల్వే అధికారులు కోరారు. రద్దు చేసిన, దారి మళ్లించిన రైళ్ల వివరాలను టికెట్​ బుక్​ చేసుకున్న ప్రయాణికుల ఫోన్లకు మెసేజ్​ పంపుతామన్నారు. ప్రయాణికులు అధికారులతో సహకరించాలని కోరారు. వర్షాలను దృష్టిలో పెట్టుకొని తమ ప్రయాణాలను ప్లాన్​ చేసుకోవాలని సూచించారు.

 

Must Read
Related News