Homeతెలంగాణnizamabad commissionerate | కమిషనరేట్​లో పలువురు ఎస్సైల బదిలీ.. కొందరిపై వేటు

nizamabad commissionerate | కమిషనరేట్​లో పలువురు ఎస్సైల బదిలీ.. కొందరిపై వేటు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: nizamabad commissionerate | నిజామాబాద్​ కమిషనరేట్​ పరిధిలో పలువురు ఎస్సైలు బదిలీ si transfers nizamabad అయ్యారు. ప్రత్యేకించి ఆరోపణలు ఉన్న పలువురిని విధుల నుంచి తప్పించారు. జక్రాన్​పల్లి తిరుపతిని వీఆర్​కు అటాచ్​ చేశారు. అలాగే ఆర్మూర్​ పీఎస్​ ఎస్సై–1 మహేశ్​ను సైతం వీఆర్​కు పంపించారు. మెండోరా ఎస్సై నారాయణను వీఆర్​కు అటాచ్​ చేశారు.

సీసీఎస్​లో ఉన్న రమేశ్​ను ఆర్మూర్​ పీఎస్​ ఎస్సై–1గా నియమించారు. నిర్మల్​ జిల్లా లక్ష్మణచందా పీఎస్​ ఎస్సై మాలిక్​ రెహమాన్​ను జక్రాన్​పల్లి ఎస్సైగా బదిలీ చేశారు. రెండో టౌన్​లో ఉన్న ఎస్సై యాసిర్​ అరాఫత్​ను మెండోరా ఎస్సైగా నియమించారు. జగిత్యాల్​ వీఆర్​లో ఉన్న సయ్యద్​ ఇమ్రాన్​ను రెండో ఎస్సై–1గా ట్రాన్స్​ఫర్​ చేశారు. కాగా.. సీపీ సాయి చైతన్య పలువురి పనితీరుపై అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే తాజా బదిలీలు జరిగినట్లు తెలుస్తోంది.

Must Read
Related News