అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో (SC/ST case) ముగ్గురికి జైలుశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. మోర్తాడ్ మండలం (Mortad mandal) రామన్నపేటకు చెందిన ఒక దళిత వ్యక్తిని దూషించిన ఘటనలో పలువురిపై కేసు నమోదైంది.
ఈ కేసును విచారించిన న్యాయస్థానం సిరికొండ మండలం రావుట్ల గ్రామానికి చెందిన బాజిరెడ్డి రమాకాంత్, భీమ్గల్ మండలం పిప్రి గ్రామానికి (Pipri village) చెందిన జనార్దన్, కోమన్పల్లికి చెందిన మల్లేశ్కు నాలుగేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. రూ.5వేల జరిమానా సైతం విధించారు. జరిమానా కట్టని పరిస్థితుల్లో మరో నెలపాటు సాధారణ జైలు శిక్ష విధించారు. ఇదే కేసులో భీమ్గల్కు చెందిన పాలెం గంగాధర్, బాల్కొండ మండలం (Balkonda Mandal) రామన్నపేటకు చెందిన కాకి విజయ, భీమ్గల్కు చెందిన అనురాధకు రూ.3,000 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.