అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Drunk drive | డ్రంకన్ డ్రైవ్లో పలువురికి జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ (Traffic ACP Mastan Ali) తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ (Traffic Inspector Prasad) ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీలు చేస్తుండగా.. 17 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతున్నట్లుగా గుర్తించారు. ఈ సందర్భంగా వారికి కౌన్సెలింగ్ నిర్వహించి అనంతరం మార్నింగ్ కోర్టులో ప్రవేశపెట్టారు. విచారించిన కోర్టు 11 మందికి రూ.10వేల చొప్పున, ఒకరికి రూ.15వేలు జరిమానా విధించారు.
Drunk drive | ఐదుగురికి వారంరోజుల పాటు..
ఐదుగురికి వారంరోజుల పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పుచెప్పినట్లు ట్రాఫిక్ ఏసీపీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మద్యం తాగి వాహనాలు నడిపితే చట్టప్రకారం కఠిన శిక్షలు అమలవుతాయన్నారు. అలాగే భారీ జరిమానాలు విధిస్తున్నామని పేర్కొన్నారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వెళ్లాలని సూచించారు.