Homeజిల్లాలునిజామాబాద్​Drunk Driving | డ్రంకన్​ డ్రైవ్​ తనిఖీల్లో పట్టుబడిన పలువురికి జైలు శిక్ష

Drunk Driving | డ్రంకన్​ డ్రైవ్​ తనిఖీల్లో పట్టుబడిన పలువురికి జైలు శిక్ష

నిజామాబాద్​ జిల్లా వ్యాప్తంగా పోలీసులు డ్రంకన్​ డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేశారు. మద్యం తాగి వాహనాలు నడిపిస్తే భారీ జరిమానాలు విధిస్తున్నారు.

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ/ ఆర్మూర్: Drunk Driving | డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన పలువురికి జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది.

ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ (Traffic ACP Mastan Ali) తెలిపిన వివరాల ప్రకారం.. ట్రాఫిక్ ఇన్​స్పెక్టర్​ ప్రసాద్ ఆధ్వర్యంలో నగరంలో డ్రంకన్​ డ్రైవ్ తనిఖీలు (drunk driving checks) చేపట్టగా 12 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతున్నట్లుగా గుర్తించారు. వారికి కౌన్సెలింగ్ నిర్వహించి సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ ఎదుట హాజరుపర్చారు. విచారణ చేపట్టిన న్యాయమూర్తి 8 మందికి రూ. 59వేల జరిమానా విధించారు. మరో నలుగురికి జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారని ట్రాఫిక్ ఏసీపీ తెలిపారు.

Drunk Driving | ఆర్మూర్​లో..

ఆర్మూర్ పట్టణంలో డ్రంకన్​ డ్రైవ్ తనిఖీలు చేపట్టినట్లు ఎస్​హెచ్​వో సత్యనారాయణ (SHO Satyanarayana) తెలిపారు. ఈ తనిఖీల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకొని ఆర్మూర్ కోర్టులో హాజరు పరిచారు. ఈ ముగ్గురికి రూ. 10వేల చొప్పున జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు చెప్పిందని ఎస్​హెచ్​వో తెలిపారు.

Must Read
Related News