అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Drunk Drive | డ్రంకన్ డ్రైవ్లో (Drunk Drive) పట్టుబడిన పలువురికి న్యాయస్థానం జైలుశిక్ష విధించింది. ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ తెలిపిన వివరాల ప్రకారం.. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ (Traffic Inspector Prasad) ఆధ్వర్యంలో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టగా.. పలువురు మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు.
వారికి కౌన్సెలింగ్ నిర్వహించి.. సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నుర్జహాన్ (Magistrate Nurjahan) ఎదుట హాజరుపర్చారు. 32 మంది మద్యం తాగి వాహనాలు నడపగా.. వారికి రూ. 56,500 జరిమానా విధించారు. అందులో ఇద్దరికి రెండురోజుల జైలుశిక్ష, ఒకరికి మూడురోజుల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ (Traffic ACP Mastan Ali) మాట్లాడుతూ.. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల ఇతరులకు కూడా నష్టం జరిగే అవకాశాలున్నాయని చెప్పారు.
