అక్షరటుడే, బాన్సువాడ: Nasrullabad | నస్రుల్లాబాద్ మండలం సంగెం గ్రామ శివారులో పేకాట స్థావరంపై శనివారం పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. 8 బైక్లు, రూ.4,500 స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై అరుణ్ కుమార్ తెలిపారు. దాడుల్లో కానిస్టేబుళ్లు రమేష్, శ్రీధర్, గౌరీ పాల్గొన్నారు.
