More
    Homeజిల్లాలుకామారెడ్డిKamareddy SP | డ్రంకన్​ డ్రైవ్ కేసుల్లో పలువురికి జరిమానా : ఎస్పీ రాజేష్ చంద్ర

    Kamareddy SP | డ్రంకన్​ డ్రైవ్ కేసుల్లో పలువురికి జరిమానా : ఎస్పీ రాజేష్ చంద్ర

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP | జిల్లాలో మద్యం సేవించి వాహనం నడిపిన 21 మందికి జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చిందని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra ) తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ప్రకటన విడుదల చేశారు.

    జిల్లాలోని కామారెడ్డి పోలీస్ స్టేషన్ (Kamareddy Police Station) పరిధిలో ఆరుగురికి, దేవునిపల్లిలో ఐదుగురికి, భిక్కనూరులో ఇద్దరికి, రాజంపేటలో ఒకరికి, బీబీపేటలో ఇద్దరికి, దోమకొండలో ఇద్దరికి, సదాశివనగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ముగ్గురికి జరిమానాలు విధించడం జరిగిందన్నారు.

    మొత్తంగా 21 మందికి జరిమానా విధించామని స్పష్టం చేశారు. అలాగే దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకరికి రూ.వెయ్యి జరిమానాతో పాటు 2 రోజుల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారని వివరించారు. మద్యం సేవించి వాహనం నడపవద్దని ఈ సందర్భంగా ఎస్పీ సూచించారు.

    More like this

    Nizamabad | భారీగా అల్ప్రాజోలం పట్టివేత

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad | నిజామాబాద్ నగర శివారులో నార్కోటిక్ బృందం అధికారులు మంగళవారం దాడులు...

    Bathukamma Young Filmmakers’ Challenge | యువ కంటెంట్ క్రియేటర్లకు ప‌ట్టం.. బతుక‌మ్మ యంగ్ ఫిల్మ్ మేక‌ర్స్ ఛాలెంజ్ – 2025 పేరిట షార్ట్ ఫిలిమ్స్ పోటీలు!

    అక్షరటుడే, హైదరాబాద్: Bathukamma Young Filmmakers’ Challenge | తెలంగాణ‌లోని యువ కంటెంట్ క్రియేటర్లకు తెలంగాణ ఫిల్మ్ డెవ‌ల‌ప్‌మెంట్...

    IAS Transfers | తెలంగాణలో పలువురు ఐఏఎస్​ల బదిలీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IAS Transfers | రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ (IAS)​లను ప్రభుత్వం ట్రాన్స్​ఫర్​ చేసింది. నలుగురు...