అక్షరటుడే, వెబ్డెస్క్: Constables Promotions | నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న పలువురు కానిస్టేబుళ్లకు పోలీస్ శాఖ పదోన్నతి కల్పించింది. ఈ మేరకు నిజామాబాద్ సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) ఉత్తర్వులు జారీ చేశారు. పదిమంది కానిస్టేబుళ్లకు బాసర జోన్–2 పరిధిలో హెడ్ కానిస్టేబుళ్లుగా (head constables) ప్రమోషన్ కల్పించారు.
పదోన్నతిపై వీరిని జగిత్యాల జిల్లాకు పంపించారు. ప్రమోషన్ పొందిన వారిలో కమ్మర్పల్లి (Kammarpally) పీఎస్ కానిస్టేబుల్ వరప్రసాద్, పీసీఆర్ పీసీ సీహెచ్.శేఖర్, భీమ్గల్ పోలీస్స్టేషన్కానిస్టేబుల్ జి.శ్రీనివాస్, మాక్లూర్ (Makloor) ఠాణాకు చెందిన కె.యాదవ్, టూటౌన్ కానిస్టేబుల్ ఎండీ.ఆరీఫుద్దీన్, కోటగిరి పీఎస్కు చెందిన కె.చిన్నయ్య, నవీపేట ఠాణా కానిస్టేబుల్ డి.శ్రీనివాస్రావు, రెంజల్ పీఎస్కు చెందిన ఎల్.లింబాద్రి, ఓడీ కానిస్టేబుల్ పి.రాంచందర్, నిజామాబాద్ రూరల్ పీఎస్ కానిస్టేబుల్ పి.గణేశ్ ఉన్నారు. కాగా.. వీరు జగిత్యాల జిల్లాలో రిపోర్ట్ చేయనున్నారు. అనంతరం వీరికి పోస్టింగ్ ఇవ్వనున్నారు.
