Homeతాజావార్తలుJubilee Hills counting | ముగిసిన ఏడో రౌండ్​ కౌంటింగ్.. భారీ ఆధిక్యంలో కాంగ్రెస్

Jubilee Hills counting | ముగిసిన ఏడో రౌండ్​ కౌంటింగ్.. భారీ ఆధిక్యంలో కాంగ్రెస్

జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికల కౌంటింగ్​ కొనసాగుతోంది. రౌండ్​ రౌండ్​కు కాంగ్రెస్​ పార్టీ ఆధిక్యం పెరుగుతోంది. దీంతో గాంధీ భవన్​ వద్ద కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jubilee Hills counting | జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికల కౌంటింగ్​ (Jubilee Hills by-election counting) నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. కౌంటింగ్ ప్రక్రియ సాగుతుండడంతో ఏ పార్టీ గెలుస్తుందోనని ప్రజలు చర్చించుకుంటున్నాయి. అయితే అధికార కాంగ్రెస్​ గెలుపు దిశగా సాగుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్​ 19,619 ఓట్ల మెజారిటీలో కొనసాగుతోంది.

ఉదయం 8 గంటలకు కోట్ల విజయ భాస్కర్​ రెడ్డి స్టేడియంలో కౌంటింగ్​ ప్రక్రియ ప్రారంభం కాగా.. ఆది నుంచి కాంగ్రెస్​ పార్టీ (Congress party) హవా కొనసాగుతోంది. తొలి రౌండ్​లో పోటీ ఇచ్చిన బీఆర్​ఎస్​ ఆ తర్వాత వెనుకబడిపోయింది. ఇప్పటి వరకు ఒక్క రౌండ్​లో కూడా ఆ పార్టీ ఆధిక్యం సాధించకపోవడం గమనార్హం. షేక్​పేట, రహ్మత్ ​నగర్​, వెంగళ్​రావు నగర్, యూసుఫ్​గూడ​ డివిజన్​లలో లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. అన్ని రౌండ్లలో కాంగ్రెస్​ అభ్యర్థి లీడ్​ సాధిస్తుండడం గమనార్హం. పది రౌండ్లలో మొత్తం లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. దీంతో మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఫైనల్ రిజల్ట్​ తేలనుంది. ఏడో రౌండ్​లో కాంగ్రెస్​ 4,030 ఓట్ల మెజారిటీ సాధించింది.

Jubilee Hills counting | రౌండ్ల వారీగా ఓట్ల వివరాలు..

కౌంటంగ్​లో ఆది నుంచి కాంగ్రెస్​ పార్టీ లీడ్​లో సాగుతోంది. పోస్టల్​ బ్యాలెట్​ (postal ballot), తొలిరౌండ్​లో స్వల్ప ఆధిక్యం సాధించిన హస్తం పార్టీ, రెండు, మూడు, నాలుగు, ఐదో రౌండ్లలో భారీ మెజారిటీ సాధించింది. పోస్టల్‌ బ్యాలెట్‌లో బీఆర్ఎస్ – 36, కాంగ్రెస్ – 39, బీజేపీ – 10 పోస్టల్​ ఓట్లు సాధించాయి.

తొలి రౌండ్​లో కాంగ్రెస్​ అభ్యర్థి నవీన్​ యాదవ్​ (Congress candidate Naveen Yadav) 8,911, బీఆర్​ఎస్​ అభ్యర్థి మాగంటి సునీత 8,864 ఓట్లు సాధించారు. బీజేపీ 2,167 ఓట్లు సాధించింది. నాలుగో రౌండ్​ పూర్తయ్యే సరికి నవీన్​ యాదవ్​ 38,566 ఓట్లు, మాగంటి సునీత (Maganti Sunitha) 29,007, దీపక్​ రెడ్డి 7,296 ఓట్లు సాధించారు.

కాంగ్రెస్​ తొలిరౌండ్​లో 47 ఓట్లు, రెండో రౌండ్​లో 2,947, మూడో రౌండ్‌లో 2,843, నాలుగో రౌండ్‌లో 3,558 ఐదో రౌండ్​లో 3,178, ఆరో రౌండ్​లో 2,938, ఏడో రౌండ్​లో 4,030 ఓట్లు ఆధిక్యం కనబరిచింది. మొదటి రౌండ్​లో కాస్తా పోటీ ఇచ్చిన బీఆర్​ఎస్​ తర్వాత వెనకబడిపోయింది. ఇక బీజేపీ చాలా దూరంలో ఉండిపోయింది. మరోవైపు గాంధీభవన్​లో (Gandhi Bhavan) కాంగ్రెస్​ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్​రెడ్డి కౌంటింగ్​ హాల్ నుంచి వెళ్లిపోయారు.

Must Read
Related News