అక్షరటుడే, వెబ్డెస్క్ : Jubilee Hills counting | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ (Jubilee Hills by-election counting) నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. కౌంటింగ్ ప్రక్రియ సాగుతుండడంతో ఏ పార్టీ గెలుస్తుందోనని ప్రజలు చర్చించుకుంటున్నాయి. అయితే అధికార కాంగ్రెస్ గెలుపు దిశగా సాగుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ 19,619 ఓట్ల మెజారిటీలో కొనసాగుతోంది.
ఉదయం 8 గంటలకు కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా.. ఆది నుంచి కాంగ్రెస్ పార్టీ (Congress party) హవా కొనసాగుతోంది. తొలి రౌండ్లో పోటీ ఇచ్చిన బీఆర్ఎస్ ఆ తర్వాత వెనుకబడిపోయింది. ఇప్పటి వరకు ఒక్క రౌండ్లో కూడా ఆ పార్టీ ఆధిక్యం సాధించకపోవడం గమనార్హం. షేక్పేట, రహ్మత్ నగర్, వెంగళ్రావు నగర్, యూసుఫ్గూడ డివిజన్లలో లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. అన్ని రౌండ్లలో కాంగ్రెస్ అభ్యర్థి లీడ్ సాధిస్తుండడం గమనార్హం. పది రౌండ్లలో మొత్తం లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. దీంతో మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఫైనల్ రిజల్ట్ తేలనుంది. ఏడో రౌండ్లో కాంగ్రెస్ 4,030 ఓట్ల మెజారిటీ సాధించింది.
Jubilee Hills counting | రౌండ్ల వారీగా ఓట్ల వివరాలు..
కౌంటంగ్లో ఆది నుంచి కాంగ్రెస్ పార్టీ లీడ్లో సాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ (postal ballot), తొలిరౌండ్లో స్వల్ప ఆధిక్యం సాధించిన హస్తం పార్టీ, రెండు, మూడు, నాలుగు, ఐదో రౌండ్లలో భారీ మెజారిటీ సాధించింది. పోస్టల్ బ్యాలెట్లో బీఆర్ఎస్ – 36, కాంగ్రెస్ – 39, బీజేపీ – 10 పోస్టల్ ఓట్లు సాధించాయి.
తొలి రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ (Congress candidate Naveen Yadav) 8,911, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత 8,864 ఓట్లు సాధించారు. బీజేపీ 2,167 ఓట్లు సాధించింది. నాలుగో రౌండ్ పూర్తయ్యే సరికి నవీన్ యాదవ్ 38,566 ఓట్లు, మాగంటి సునీత (Maganti Sunitha) 29,007, దీపక్ రెడ్డి 7,296 ఓట్లు సాధించారు.
కాంగ్రెస్ తొలిరౌండ్లో 47 ఓట్లు, రెండో రౌండ్లో 2,947, మూడో రౌండ్లో 2,843, నాలుగో రౌండ్లో 3,558 ఐదో రౌండ్లో 3,178, ఆరో రౌండ్లో 2,938, ఏడో రౌండ్లో 4,030 ఓట్లు ఆధిక్యం కనబరిచింది. మొదటి రౌండ్లో కాస్తా పోటీ ఇచ్చిన బీఆర్ఎస్ తర్వాత వెనకబడిపోయింది. ఇక బీజేపీ చాలా దూరంలో ఉండిపోయింది. మరోవైపు గాంధీభవన్లో (Gandhi Bhavan) కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్రెడ్డి కౌంటింగ్ హాల్ నుంచి వెళ్లిపోయారు.
