ePaper
More
    HomeతెలంగాణNIT Students | జలపాతం చూసేందుకు వెళ్లి.. కారడవిలో చిక్కుకున్న ఏడుగురు ఇంజినీరింగ్​ విద్యార్థులు

    NIT Students | జలపాతం చూసేందుకు వెళ్లి.. కారడవిలో చిక్కుకున్న ఏడుగురు ఇంజినీరింగ్​ విద్యార్థులు

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: NIT Students : వారంతా ఇంజినీరింగ్​ విద్యార్థలు.. ఎంతో సరదాగా జలపాతం చూడడానికి అడవిలోకి వెళ్లారు. భారీ వర్షాల నేపథ్యంలో ఆంక్షలు విధించినా.. కాపలా సిబ్బందిని మాయ చేసి, కళ్లుగప్పి అడవిలోకి చొరబడ్డారు. భారీ వర్షంతో దారి తప్పారు. కాకులు దూరని కారడవిలో చిక్కుకుపోయారు. దిక్కుతోచని స్థితిలో ఆరు గంటలకు పైగా అల్లాడారు. అటవీశాఖ, పోలీసు అధికారుల సాయంతో ఎట్టకేలకు సురక్షితంగా బయటపడ్డారు.

    తెలంగాణ – ఛత్తీస్​గఢ్​ సరిహద్దులోని (Telangana-Chhattisgarh border) ములుగు జిల్లా (Mulugu district) వెంకటాపురం మండలం (Venkatapuram mandal) మైతాపురం (Maithapuram) అడవుల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఏడుగురు వరంగల్ NIT విద్యార్థులు (Warangal NIT students) శనివారం ఉదయం వెంకటాపురం బయలుదేరారు. అక్కడికి చేరుకున్నాక బొగత జలపాతాల Bogatha waterfalls సందర్శనకు అనుమతి లేదని తెలిసింది. కానీ, వీరు వెనక్కి వెళ్లిపోలేదు. ఎలాగైనా జలపాతం చూసి తీరాలని నిర్ణయించుకున్నారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించి, కాపలా సిబ్బంది కళ్లుగప్పి అడవిలోపలికి వెళ్లారు.

    READ ALSO  Jubilee Hills | జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో పోటీపై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
    NIT Students | జలపాతం చూడబోయి కారడవిలో చిక్కుకున్న ఏడుగురు ఇంజినీరింగ్​ విద్యార్థులు
    NIT Students | జలపాతం చూడబోయి కారడవిలో చిక్కుకున్న ఏడుగురు ఇంజినీరింగ్​ విద్యార్థులు

    NIT Students : బతుకు జీవుడా అంటూ..

    జలపాతం వద్దకు చేరుకుని ఎంజాయ్​ చేశారు. సెల్ఫీలతో సందడి చేశారు. సాయంత్రం వరకు సరదాగా గడిపారు. ఇక తిరుగు ప్రయాణంలోనే అసలు సమస్య మొదలైంది. దారి తప్పి అడవిలోపలకు వెళ్లిపోయారు. ఎంత దూరం వెళ్లినా బయటకు వచ్చే దారి తెలియలేదు. దీంతో ఆరు గంటలపాటు కారడవిలోనే తిరుగుతూ ఉండిపోయారు. చివరికి భయం పట్టుకుని బతుకు జీవుడా అంటూ సాయం కోసం డయల్​ 100కు కాల్​ చేశారు.

    సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది, పోలీసులు తక్షణమే స్పందించారు. ఓ వైపు కుండపోత వర్షం కురుస్తున్నా.. విద్యార్థులను వెతికేందుకు అడవిబాట పట్టారు. విద్యార్థుల లొకేషన్ ఆధారంగా అతి కష్టం మీద కాలినడకన వారి వద్దకు చేరుకున్నారు.

    వారిని వెంట తీసుకుని సురక్షితంగా తిరిగి బయటకు వచ్చారు. ఆరు గంటలపాటు ఆచూకీ లేక అల్లాడిన విద్యార్థులు.. సురక్షితంగా గమ్యం చేరుకోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

    READ ALSO  ACB Case | మాజీ ఈఎన్​సీ అక్రమాస్తుల కేసులో వెలుగులోకి కీలక విషయాలు

    NIT Students : అమ్మాయిలు కూడా ఉన్నారు..

    క్రూర మృగాలు తిరిగే కారడవిలో చిక్కుకుపోయిన విద్యార్థుల్లో ముగ్గురు అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలు ఉన్నారు. వీరు వరంగల్‌లోని ఎన్ఐటీలో బీటెక్ చదువుతున్నారు. వారాంతం సరదాగా గడిపేందుకు వెళ్లి ఊహించని ప్రమాదంలో చిక్కుకుపోయారు.

    పోలీసులు, అటవీశాఖ సిబ్బంది కలిసి విద్యార్థులను వెంకటాపురానికి తీసుకొచ్చారు. అక్కడ వారికి ఆహారం అందించారు. తర్వాత ప్రత్యేక వాహనంలో హన్మకొండకు పంపించారు.

    NIT Students : అనుమతి లేదు..

    కుండపోత వర్షాలు కురుస్తున్నందున జలపాతాల సందర్శనకు అనుమతి లేదని అటవీశాఖ అధికారులు, పోలీసులు స్పష్టం చేశారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

    Latest articles

    Cp Sai chaitanya | రిమార్క్​ లేకుండా పదవీ విరమణ చేయడం అభినందనీయం : సీపీ

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Cp Sai chaitanya | ఎలాంటి రిమార్క్​ లేకుండా పదవీ విరమణ చేయడం ఎంతో...

    IND vs ENG Test | వ‌రుస‌గా టాస్ ఓడిన భార‌త్.. లంచ్ స‌మ‌యానికి రెండు వికెట్లు కోల్పోయి భార‌త్ ఎంత స్కోరు చేసిందంటే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IND vs ENG Test | ఓవ‌ల్ మైదానం వేదిక‌గా ప్రారంభ‌మైన‌ ఇంగ్లండ్- భార‌త్...

    Ex Mla Jeevan Reddy | అమలు కాని హామీలను ప్రజలు ప్రశ్నించాలి

    అక్షరటుడే, ఆర్మూర్: Ex Mla Jeevan Reddy | కాంగ్రెస్​ చేపడుతున్న పాదయాత్రలో అమలు కాని హామీలను ప్రజలు...

    Mahila Congress President | జంతర్ మంతర్ ధర్నాకు కవిత రావాలి : సునీత రావు

    అక్షరటుడే, కామారెడ్డి: Mahila Congress President | బీసీల కోసం కొట్లాడాలనుకుంటున్న కవితకు (MLC Kavitha) చిత్తశుద్ధి ఉంటే...

    More like this

    Cp Sai chaitanya | రిమార్క్​ లేకుండా పదవీ విరమణ చేయడం అభినందనీయం : సీపీ

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Cp Sai chaitanya | ఎలాంటి రిమార్క్​ లేకుండా పదవీ విరమణ చేయడం ఎంతో...

    IND vs ENG Test | వ‌రుస‌గా టాస్ ఓడిన భార‌త్.. లంచ్ స‌మ‌యానికి రెండు వికెట్లు కోల్పోయి భార‌త్ ఎంత స్కోరు చేసిందంటే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IND vs ENG Test | ఓవ‌ల్ మైదానం వేదిక‌గా ప్రారంభ‌మైన‌ ఇంగ్లండ్- భార‌త్...

    Ex Mla Jeevan Reddy | అమలు కాని హామీలను ప్రజలు ప్రశ్నించాలి

    అక్షరటుడే, ఆర్మూర్: Ex Mla Jeevan Reddy | కాంగ్రెస్​ చేపడుతున్న పాదయాత్రలో అమలు కాని హామీలను ప్రజలు...