అక్షరటుడే, వెబ్డెస్క్ : Maoists | మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఏపీ డీజీపీ (AP DGP) హరీశ్కుమార్గుప్తా ఎదుటు పలువురు మావోయిస్టులు (Maoists) శనివారం లొంగిపోయారు. వీరిలో అగ్రనేతలు కమలేశ్, అరుణ ఉన్నారు. కృష్ణ జిల్లాకు చెందిన వీరు మావోయిస్టు పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. అరుణ ప్రస్తుతం డివిజన్ కమిటీ సభ్యురాలిగా కొనసాగుతోంది. తాజాగా వీరు లొంగిపోయారు.
Maoists | భారీగా ఆయుధాలు స్వాధీనం
లొంగిపోయిన మావోయిస్టుల నుంచి పోలీసులు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దు (AOB)లోని మావోయిస్ట్ డంప్ను కనుగొన్నారు. ఏకే 47 సహా 15 తుపాకులు, రాకెట్ లాంచర్లను పట్టుకున్నారు. అత్యాధునిక ఆయుధాలతో పాటు, వాకీటాకీలు, హ్యాండ్ గ్రనేడ్లు ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.
Maoists | ఆపరేషన్ కగార్తో..
ఆపరేషన్ కగార్తో (Operation Kagar) మావోయిస్టులు కలవరపడుతున్నారు. 2026 మార్చి 31 వరకు దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) ప్రకటించారు. ఈ మేరకు వేల సంఖ్యలో బలగాలు అడవులను జల్లెడ పడుతున్నాయి. నిత్యం ఎన్కౌంటర్లు చోటు చేసుకొని చాలా మంది మావోలు మృతి చెందుతున్నారు. దీంతో పలువురు మావోయిస్టులు ఉద్యమ బాట వీడుతున్నారు. దీంతో ఇటీవల లొంగుబాట్లు పెరిగాయి. రెండు రోజుల క్రితం ఛత్తీస్గఢ్లో 51 మంది మావోలు లొంగిపోయారు (Maoists Surrender). వరుస లొంగుబాట్లు, ఎన్కౌంటర్లు మావోలు ఆందోళన చెందుతున్నారు.
Maoists | ఆయుధాలు వీడాలి
మావోయిస్టులు ఆయుధాలు వీడి జన జీవన స్రవంతిలో కలవాలని ఏపీ డీజీపీ హరీశ్కుమార్ గుప్తా సూచించారు. రాష్ట్రానికి చెందిన 21 మంది వివిధ రాష్ట్రాల్లో మావోయిస్టు సభ్యులుగా ఉన్నారని చెప్పారు. మావోయిస్టులకు లొంగిపోవడం తప్ప మరో మార్గం లేదని ఆయన స్పష్టం చేశారు. లొంగిపోకపోతే మావోల నియంత్రణకు చర్యలు చేపడతామని ఆయన హెచ్చరించారు.