అక్షరటుడే, ఇందల్వాయి:Indalwai | వరుస చోరీలకు పాల్పడుతున్న ఓ దొంగను గ్రామస్థులు వలవేసి పట్టుకున్నారు. ఈ ఘటన ఇందల్వాయి(Indalwai) గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది.
గ్రామస్థుల తెలిపిన వివరాల ప్రకారం.. గతవారం ఏడిళ్లల్లో ఒకేరోజు చోరీలు జరిగాయి. దీంతో అప్రమత్తమైన గ్రామస్థులు ప్రతిరోజు గస్తీ(patrolling) తిరుగుతున్నారు. గురువారం రాత్రి సైతం కారులో వచ్చిన నలుగురు దొంగలు గ్రామంలోని షేక్ నిస్సార్ హైమద్ ఇంట్లో చోరీ చేశారు. అనంతరం మరో ఇంట్లో చోరీ చేసేందుకు వెళ్తుండగా గ్రామస్థులు వెంబడించి ఓ దొంగను పట్టుకున్నారు. అనంతరం అతడిని పోలీసులకు(indalwai Police) అప్పగించినట్లు గ్రామస్థులు పేర్కొన్నారు. గ్రామస్థుడు షేక్ నిస్సార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.