Homeఆంధప్రదేశ్Kurnool Bus Accident | కర్నూల్​ ప్రమాదంలో సంచలన విషయాలు.. కాలిపోయిన బస్సుపై 16 చలాన్లు..

Kurnool Bus Accident | కర్నూల్​ ప్రమాదంలో సంచలన విషయాలు.. కాలిపోయిన బస్సుపై 16 చలాన్లు..

కర్నూల్​లో ప్రమాదానికి గురైన బస్సుపై 16 చలాన్లు పెండింగ్​లో ఉన్నాయి. అయితే బస్సు ఫిట్​గానే ఉందని, బైక్​ను ఢీకొనడంతో మంటలు వ్యాపించినట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kurnool Bus Accident | కర్నూల్ జిల్లాలో బస్సు కాలిపోయిన ఘటన అనేక కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు (Vemuri Kaveri Travels Bus) దగ్ధమైన విషయం తెలిసిందే.

బస్సు బైక్​ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పలువురు ప్రాణాలతో బయటపడగా.. 20 మంది వరకు చనిపోయినట్లు తెలిసింది. ఇప్పటికే పోలీసులు 19 మంది మృతదేహాలను వెలికితీశారు. అయితే ప్రమాదానికి గురైన బస్సుపై తెలంగాణ (Telangana) లో 16 చలాన్లు పెండింగ్​లో ఉన్నాయి.

Kurnool Bus Accident | నో ఎంట్రీ జోన్​లోకి..

ప్రమాదానికి గురైన వేమురి కావేరి ట్రావెల్స్​ బస్సు DD01 N9490 నంబర్​తో రిజిస్టర్​ అయింది. ఈ బస్సుపై రూ.23,120 ఫైన్లు పెండింగ్‌లో ఉన్నాయి. 2024 జనవరి 27 నుంచి 2025 అక్టోబరు 9 వరకు 16 సార్లు ఈ బస్సు ట్రాఫిక్‌ నిబంధనలను (Traffic Rules) ఉల్లంఘించింది. ఇందులో నో ఎంట్రీ జోన్​లోకి వెళ్లడంతో పాటు డేంజరస్​ డ్రైవింగ్​ ఫైన్లు కూడా ఉన్నాయి. అలాగే నో పార్కింగ్​లో నిలిపినందుకు సైతం చలాన్లు వేశారు.

Kurnool Bus Accident | ఫిట్​గానే ఉంది

ప్రమాదానికి గురైన బస్సు ఫిట్‌గానే ఉందని రవాణా శాఖ అధికారులు తెలిపారు. బైక్‌ను బలంగా ఢీకొట్టడంతోనే మంటలు వచ్చాయని వెల్లడించారు. ఆ బస్సుకు 2030 ఏప్రిల్‌ 30 వరకు టూరిస్ట్‌ పర్మిట్‌ జారీ ఉందని, 2027 మార్చి 31 వరకు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్​ సైతం ఉందని వెల్లడించారు. 2026 ఏప్రిల్‌ 20 వరకు ఇన్సూరెన్స్‌ కూడా ఉందని తెలిపారు.

Kurnool Bus Accident | పరిహారం ప్రకటించిన మోదీ

కర్నూలు బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ (Prime Minister Modi) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ. 50 వేల తక్షణ సాయం అందిస్తామని ప్రకటించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) సైతం ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Kurnool Bus Accident | కంట్రోల్​ రూమ్​ల​ ఏర్పాటు

బస్సు ప్రమాదం ఘటనపై ప్రభుత్వం కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేసింది. కర్నూలు కలెక్టరేట్​లోని కంట్రోల్ రూమ్ నంబర్​ 08518-277305, కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి కంట్రోల్ రూమ్ నంబర్​ 9121101059, ఘటనా స్థలి వద్ద కంట్రోల్ రూమ్ నంబర్​ 9121101061, పోలీస్ ఆఫీసు కంట్రోల్ రూమ్ నంబర్​ 9121101075, కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి హెల్ప్ డెస్క్ నంబర్లు 9494609814, 9052951010 ఏర్పాటు చేసింది. ఆ బస్సుల్లో ప్రయాణించిన వారి కుటుంబ సభ్యులు, బంధువులు వివరాల కోసం ఆయా నెంబర్లకు ఫోన్​ చేయొచ్చని అధికారులు తెలిపారు.