అక్షరటుడే, వెబ్డెస్క్ : Anantapur | అనంతపురం(Anantapur) జిల్లాలో జరిగిన ఇంటర్ విద్యార్థిని తన్మయి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మంగళవారం ఎస్పీ జగదీశ్(SP Jagadeesh) కేసు వివరాలు వెల్లడించారు. నరేశ్ అనే వ్యక్తి తన్మయిని హత్య చేశాడని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.
నగరంలోని రామకృష్ణానగర్కు చెందిన లక్ష్మీపతి కుమార్తె తన్మయి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఇంటర్ చదువుతున్న తన్మయి ఈ నెల 3వ తేదీ నుంచి కనిపించడం లేదు. దీంతో తల్లిదండ్రులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ నెల 7న తన్మయి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. పోలీసులు సకాలంలో స్పందించకపోవడంతోనే తమ కూతురు మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Anantapur | ప్రేమ పేరుతో దగ్గరై..
ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. తన్మయికి మూడు నెలల క్రితం నరేశ్ పరిచయం అయ్యాడు. నెల క్రితం నుంచి వీరు ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో పెళ్లి(Marriage) చేసుకుందామని చెప్పి తన్మయిని తీసుకెళ్లి నరేశ్ బండరాయితో కొట్టి హత్య చేశాడు. అయితే నరేశ్కు అంతకుముందే పెళ్లయినట్లు సమాచారం. దీంతో తన్మయిని హత్య చేసినట్లు తెలిసింది. ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. నిందితుల ప్రభుత్వ పథకాలను రద్దు చేసి, వారి ఆస్తులను కూడా అటాచ్ చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ఈ కేసు దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వన్ టౌన్ ఇన్స్పెక్టర్ రాజేంద్రనాథ్ యాదవ్ను సస్పెండ్ చేసినట్లు ఎస్పీ తెలిపారు.