అక్షరటుడే, వెబ్డెస్క్ : Vizianagaram | హైదరాబాద్ hyderabadలో పేలుళ్ల కుట్ర కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్ hyderabadలో పేలుళ్లకు కుట్ర పన్నిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. విజయనగరానికి vizianagaram చెందిన సిరాజ్, హైదరాబాద్కు చెందిన సమీర్ కలిసి పేలుళ్లు జరపాలని ప్లాన్ వేశారు. ఐసిస్ isis సహకారంలో వీరు పేలుళ్లకు కుట్ర పన్నారని గుర్తించి అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసు విచారణ సమయంలో అధికారులు పలు కీలక విషయాలు గుర్తించారు.
Vizianagaram | నాలుగు రాష్ట్రాల్లో దాడులకు ప్లాన్
పహల్గామ్ ఉగ్రదాడి pahalgam terror attack, ఆపరేషన్ సిందూర్ operation sindoor అనంతరం భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఆపరేషన్ సిందూర్తో భారత్ పాక్లోని ఉగ్రవాదులపై దాడులు చేసింది. ఈ క్రమంలో సమీర్, సిరాజ్ కలిసి దేశంలోని పలు ప్రాంతాల్లో దాడులకు పథకం పన్నారు. తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటకలో పేలుళ్లకు కుట్ర చేశారు. సమీర్ ఆరుగురు సభ్యులతో అల్- హింద్ ఇత్తేహదుల్ ముసల్మాన్ పేరుతో సంస్థను ఏర్పాటు చేశాడు.
మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్, సమీర్తో కలిసి దాడులకు పన్నాగం పన్నాడు. ఐసిస్ సహకారంతో వీరు దాడులు చేయాలని యోచించినట్లు పోలీసులు గుర్తించారు. ఇందుకోసం విజయనగరంలో సిరాజ్ పేలుడు పదార్థాలు కొనుగోలు చేశాడు.
Vizianagaram | దిల్సుఖ్నగర్ పేలుళ్ల తరహాలో..
హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్ dilsukh nagarలో 2013లో జంట పేలుళ్లు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఇదే తరహాలో దేశంలోని పలు ప్రాంతాల్లో దాడులు చేయాలని నిందితులు ప్లాన్ వేశారు. విజయనగరంలోని నాలుగు ప్రాంతాల్లో ఈ వారంలోనే పేలుళ్లకు కుట్ర చేశారు.
ముఖ్యంగా స్లమ్ ఏరియాల్లో బాంబులు పెట్టాలని పథకం పన్నినట్లు సమాచారం. దీంతో అధికారులు వారిని విచారిస్తున్నారు. విజయనగరం నుంచి ఎన్ఐఏ అధికారులు విశాఖ వెళ్లారు. సిరాజ్, సమీర్ను వారు కస్టడీలోకి తీసుకోనున్నారు. సిరాజ్ తండ్రి, సోదరుడిని విజయనగరం టూటౌన్ పోలీస్ స్టేషన్లో పోలీసులు విచారిస్తున్నారు.