Homeక్రీడలుSports Competitions | రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక

Sports Competitions | రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక

రాష్ట్రస్థాయి పోటీలకు పలువురు విద్యార్థులు ఎంపికయ్యారు. కమ్మర్​పల్లి చౌట్​పల్లి జడ్పీహెచ్​ఎస్​ విద్యార్థులు కబడ్డీ పోటీలకు, ఆర్మూర్​ మండలం మగ్గిడి విద్యార్థులు బీచ్​ వాలీబాల్​ టోర్నీకి సెలక్ట్​ అయ్యారు.

- Advertisement -

అక్షరటుడే, కమ్మర్​పల్లి/ఆర్మూర్​ : Sports Competitions | జిల్లాస్థాయిలో కబడ్డీ, బీచ్​ వాలీబాల్​ పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ మేరకు ఆయా పాఠశాలల ప్రతినిధులు శుక్రవారం వివరాలు వెల్లడించారు.

 Sports Competitions | కబడ్డీ పోటీలకు..

కమ్మర్​పల్లి మండలంలోని చౌట్​పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (Choutpally ZPH School) విద్యార్థి జాన్​పాల్ నాయక్ అండర్–17 జూనియర్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీ (State Level Kabaddi Competition)లకు ఎంపికైనట్లు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ నగేష్ తెలిపారు. ముప్కాల్​లో మంగళవారం జరిగిన జిల్లాస్థాయి టోర్నమెంట్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి జిల్లాస్థాయికి ఎంపికయ్యాడని వెల్లడించారు. అలాగే బుధవారం ఉమ్మడి జిల్లాస్థాయి టోర్నమెంట్​లో పాల్గొని ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు ఆయన పేర్కొన్నారు. ఈనెల 8 నుండి 10 వరకు భద్రాచలం కొత్తగూడెంలో 69 వ రాష్ట్ర స్థాయి పోటీలలో జిల్లా జట్టుకు ప్రాతినిథ్యం వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థిని జాన్​పాల్ నాయక్​ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓ ఆంధ్రయ్య, ఉపాధ్యాయులు అభినందించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబర్చి జాతీయస్థాయికి ఎంపిక కావాలని ఆకాంక్షించారు.

Sports Competitions | బీచ్​ వాలీబాల్​కు క్రీడాకారుల ఎంపిక

బీచ్ వాలీబాల్ (Beach Volleyball)​కు ఆర్మూర్ మండలం మగ్గిడి ఉన్నత పాఠశాల క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పీడీ మధుసూదన్ తెలిపారు. ఈనెల 4న జక్రాన్​పల్లి మండలంలోని కలిగోట్​లో నిర్వహించిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా (Nizamabad District) బీచ్ వాలీబాల్-17 టోర్నమెంట్లో మొదటి స్థానం సంపాదించిన తమ పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులను హెచ్ఎం హరిత, ఉపాధ్యాయులు, గ్రామ వీడీసీ సభ్యులు అభినందించారు. ఈ క్రీడాకారులు ఈ నెలలో ఖమ్మం జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి బీచ్ వాలీబాల్ పోటీలో పాల్గొననున్నారని పీడీ వెల్లడించారు.

Must Read
Related News