అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: TG DEECET | టీజీ డీసెట్-2025కు సంబంధించి పరీక్ష కేంద్రాల వద్ద ఆంక్షలు విధించినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya) వెల్లడించారు. నిజామాబాద్ డివిజన్లో (Nizamabad Division) మూడు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారన్నారు. ఆయా ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు ఆంక్షలు ఉంటాయని వివరించారు. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు పరీక్ష కేంద్రాల వద్ద గుమిగూడవద్దన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద జిరాక్స్ సెంటర్లు సాయంత్రం 6 గంటల వరకు మూసి ఉంచాలని సీపీ ఆదేశించారు.
