అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Excise Police | ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గంజాయి విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. మహారాష్ట్రలోని (Maharashtra) బోకర్ నుంచి రవాణా చేస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఎక్సైజ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ (Excise Enforcement) డిప్యూటీ డైరెక్టర్ సోమిరెడ్డి ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ సీఐ వెంకట్ (CI venkat) నగరంలోని అమన్నగర్, ఖిల్లారోడ్లో తనిఖీలు నిర్వహించారు. దీంట్లో భాగంగా పక్కా సమాచారం మేరకు నగరానికి చెందిన షేక్ మిరాజ్ను అదుపులోకి తీసుకున్నారు.
బైక్పై రవాణా చేస్తున్న 6.5 కేజీల ఎండు గంజాయిని తీసుకెళ్తుండగా ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గంజాయి, బైక్ను సీజ్ చేశారు. సదరు వ్యక్తి మహారాష్ట్రలోని బోకర్లో (Boker) నివాసముండే ఫారుఖ్ ఖురేషి నుండి గంజాయిని కొనుగోలు చేసి నగరంలో అమ్మేందుకు తీసుకొచ్చినట్లు ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.