అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad | అద్దెకు ఉంటున్న వారి ఇంటి బాత్రూమ్లో ఓ వ్యక్తి సీక్రెట్ కెమెరా ఏర్పాటు చేశాడు. హైదరాబాద్ నగరంలోని మధురానగర్లో (Madhuranagar) ఈ ఘటన వెలుగు చూసింది.
హైదరాబాద్ (Hyderabad) నగరానికి చదువు, ఉద్యోగాల కోసం లక్షలాది మంది వలస వస్తారు. చాలా మంది కుటుంబాలతో కలిసి అద్దె ఇళ్లలో నివాసం ఉంటారు. అలాంటి వారికి షాకింగ్ న్యూస్ ఇది. ఓ యజమాని అద్దెకు ఉంటున్న వారి ఇంటి బాత్రూమ్లో సీక్రెట్ కెమెరా (Secret Camera) ఏర్పాటు చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. ఎంతో మంది పొట్ట చేతపట్టుకొని నగరంలో బతుకుతున్నారు. అలాంటి వారు ఈ వార్తతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
Hyderabad | బల్బ్ పాడవడంతో..
మధురానగర్ పరిధిలోని జవహర్ నగర్లో (Jawahar Nagar) ఓ జంట అద్దెకు ఉంటున్నారు. అయితే వారి బాత్రూమ్లో బల్బ్ పని చేయలేదు. ఈ విషయాన్ని ఓనర్ అశోక్కు తెలపగా.. అక్టోబర్ 4న ఎలక్ట్రీషియన్ చింటు సాయంతో కొత్త హోల్డర్ ఏర్పాటు చేయించాడు. అదే సమయంలో ఇద్దరు కలిసి బల్బ్ హోల్డర్లో సీక్రెట్ కెమెరా పెట్టారు. ఈ విషయాన్ని ఆ దంపతులు ఈ నెల 13న గుర్తించారు. అనంతరం యజమానికి చెప్పగా.. ఎలక్ట్రీషియన్ చింటూ ఏర్పాటు చేసి ఉంటాడని, అతడు మంచి వాడు కాదని వారిని బెదిరించాడు.
Hyderabad | నిందితుడి అరెస్ట్..
ఈ విషయం బయటకు చెబితే చింటూ దాడి చేస్తాడని చెప్పారు. దీంతో ఆ దంపతులు ఇంటి యజమాని అశోక్తో పాటు, ఎలక్ట్రీషియన్ చింటూపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇంటి యజమాని అశోక్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఎలక్ట్రీషియన్ చింటూ పరారీలో ఉండగా.. అతడి కోసం గాలిస్తున్నారు.