అక్షరటుడే, ఇందూరు: Teachers training | ఉపాధ్యాయులకు ఈ నెల 20 నుంచి రెండో విడత శిక్షణ నిర్వహించనున్నట్లు డీఈవో అశోక్(Deo ashok) తెలిపారు. ఇందుకు సంబంధించిన సన్నాహక సమావేశాన్ని సోమవారం బోర్గాం(పి) ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు విడత శిక్షణ కోసం సెంటర్ ఇన్ఛార్జీలు, ఆర్పీలు సెషన్ వారీగా అంశాలపై అవగాహన కల్పించేందుకు సిద్ధం కావాలని సూచించారు. ఎటువంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం డైట్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ ట్రైనింగ్ను సమర్థవంతంగా నిర్వహించాలని ఆర్పీలకు సూచించారు. సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సీహెచ్ శంకర్, ఏఎంవో తదితరులు పాల్గొన్నారు.