HomeజాతీయంSBI | ఎస్​బీఐ యూపీఐ సేవలకు అంతరాయం

SBI | ఎస్​బీఐ యూపీఐ సేవలకు అంతరాయం

ఎస్​బీఐ యూపీఐ సేవల్లో అంతరాయం కలగడంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాంకేతిక కారణాలతో సమస్య తలెత్తినట్లు బ్యాంక్​ ప్రకటించింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : SBI | ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ ఎస్​బీఐ యూపీఐ సేవల్లో (UPI services) అంతరాయం కలిగింది. దీంతో కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఎస్​బీఐ యూపీఐ లావాదేవీల (UPI transactions)కు బుధవారం అంతరాయం కలిగింది. దీంతో లావాదేవీలు చేయలేకపోతున్నామని ఖాతాదారులు సోషల్​ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. బ్యాంక్​ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సైతం ఇదే సమస్యతో ఇబ్బంది పడ్డట్లు పలువురు యూజర్లు పోస్టులు పెట్టారు. ఇంత పెద్ద బ్యాంక్​ నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా దీనిపై ఎస్​బీఐ స్పందించింది.

SBI | సాంకేతిక కారణాలతో..

సాంకేతిక కారణాలతో యూపీఐ సేవల్లో అంతరాయం కలిగినట్లు ఎస్​బీఐ ప్రకటించింది. టెక్నికల్ ప్రాబ్లెమ్స్​తోనే ట్రాన్సక్షన్​లు డిక్లైన్​ అవుతున్నాయని తెలిపింది. బుధవారం రాత్రి 8 గంటల వరకు సమస్య పరిష్కరిస్తామని చెప్పింది. వినియోగదారులు అంతరాయం లేని సేవ కోసం UPI లైట్ సేవలను కొనసాగించవచ్చని బ్యాంక్​ తెలిపింది. కస్టమర్‌లకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని ప్రకటన విడుదల చేసింది. అయితే రాత్రి 8 గంటలు దాటిపోయినా కస్టమర్లు అదే సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.

Must Read
Related News