HomeజాతీయంSBI mCASH | ఎస్​బీఐ బిగ్​ అలెర్ట్​.. ఆ సేవలు నిలిపివేత

SBI mCASH | ఎస్​బీఐ బిగ్​ అలెర్ట్​.. ఆ సేవలు నిలిపివేత

ఎస్​బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30 నుంచి ఎంక్యాష్​ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: SBI mCASH | దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్​ అయిన ఎస్​బీఐ (SBI) కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్​లైన్​లో, యోనోలైట్​ (YONO Lite) ద్వారా ఎంక్యాష్​ సేవలను నిలిపి వేయనున్నట్లు ప్రకటించింది. నవంబర్​ 30 నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని ప్రకటించింది. ​

భవిష్యత్తులో అన్ని బదిలీల కోసం యూపీఐ (UPI), ఐఎంపీఎస్​, నెఫ్ట్, ఆర్టీజీఎస్ సేవలను వినియోగించుకోవాలని ఎస్​బీఐ ఖాతాదారులకు సూచించింది. ఇవి విస్తృతంగా వినియోగంలో ఉన్నాయని, సురక్షితమైనవని తెలిపింది. వినియోగదారులు mCASHను ఉపయోగించాల్సిన అవసరం లేకుండా నిధులను పంపడానికి వీలు కల్పిస్తాయని చెప్పింది. mCASH నిలిపివేత అనంతరం భవిష్యత్తులో జరిగే అన్ని డబ్బు బదిలీలు ఈ పద్ధతుల ద్వారా జరగాలని బ్యాంక్ వెబ్‌సైట్ పేర్కొంది.

SBI mCASH | ఎంక్యాష్​ అంటే ఏమిటి

ఎస్​బీఐ కస్టమర్లు లబ్ధిదారుడిని ముందుగా రిజిస్ట్రర్​ చేసుకోకుండా.. డబ్బులు పంపడానికి ఎంక్యాష్ సేవలను గతంలో ఎస్​బీఐ ప్రవేశ పెట్టింది. దీనిద్వారా వినియోగదారులు గ్రహీత మొబైల్ నంబర్, ఈ–మెయిల్ ఐడీని ఉపయోగించి Online SBI లేదా State Bank Anywhere ద్వారా నిధులను బదిలీ చేయవచ్చు. గ్రహీత mCASH మొబైల్ యాప్, ఎస్​ఎంఎస్​, ఈ-మెయిల్ ద్వారా పంపబడిన సురక్షిత లింక్ ద్వారా నిధులను క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఇతర సురక్షిత సాధనాలు అందుబాటులోకి రావడంతో ఎంక్యాష్​ అవసరం లేదని ఎస్​బీఐ భావించింది. ఈ మేరకు సేవలను నిలిపి వేస్తున్నట్లు ప్రకటించింది.

Must Read
Related News