Saudi Accident | సౌదీ బస్సు ప్రమాదం.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్​గ్రేషియా

అక్షరటుడే, హైదరాబాద్‌ : Saudi Accident | సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు తెలంగాణ కేబినెట్​ సంతాపం తెలిపింది. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. మంత్రి అజారుద్దీన్‌ (Minister Azharuddin), ఎంఐఎం ఎమ్మెల్యే, మైనార్టీ విభాగానికి చెందిన ఓ అధికారితో ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని సౌదీకి పంపించాలని సూచించింది. చనిపోయిన వారి మృతదేహాలకు అక్కడే అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించింది. బాధిత కుటుంబ సభ్యులను […]

అక్షరటుడే, హైదరాబాద్‌ : Saudi Accident | సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు తెలంగాణ కేబినెట్​ సంతాపం తెలిపింది. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.

మంత్రి అజారుద్దీన్‌ (Minister Azharuddin), ఎంఐఎం ఎమ్మెల్యే, మైనార్టీ విభాగానికి చెందిన ఓ అధికారితో ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని సౌదీకి పంపించాలని సూచించింది. చనిపోయిన వారి మృతదేహాలకు అక్కడే అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించింది. బాధిత కుటుంబ సభ్యులను ఒక్కో కుటుంబానికి ఇద్దరు చొప్పున తీసుకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది.

Saudi Accident | 45 మంది మృతులు హైదరాబాదీలే

సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 45 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. కాగా.. వీళ్లంతా హైదరాబాద్​కు చెందిన వారేనని తెలంగాణ హజ్‌ కమిటీ (Telangana Haj Committee) ఓ ప్రకటనలో తెలిపింది. మృతుల్లో 17 మంది పురుషులు, 18 మంది మహిళలు, 10 మంది చిన్నారులు ఉన్నట్లు చెప్పింది. నాలుగు ట్రావెల్‌ ఏజెన్సీల ద్వారా ఈనెల 9న హైదరాబాద్‌ (Hyderabad) నుంచి వీరు ఉమ్రాకు వెళ్లారు. మక్కా యాత్ర పూర్తిచేసుకుని మదీనాకు వెళ్తున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది.

Saudi Accident | ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మృతి

సౌదీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌లోని విద్యానగర్‌ (Vidyanagar)కు చెందిన ఒకే కుటుంబంలోని 18 మంది మృతి చెందారు. విశ్రాంత రైల్వే ఉద్యోగి నజీరుద్దీన్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి మక్కాకు వెళ్లారు. ఈ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది.

Related articles

CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డికి మరో అరుదైన గౌరవం.. హార్వర్డ్​లో ప్రసంగించే అవకాశం!

అక్షరటుడే, హైదరాబాద్​: CM Revanth Reddy | తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Telangana Chief Minister Revanth Reddy కి అంతర్జాతీయ...

The Wedding of VIROSH : పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటించిన విజయ్-రష్మిక.. ఎప్పుడంటే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: The Wedding of VIROSH | టాలివుడ్​ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక ఎట్టకేలకు తమ వివాహ బంధం వేడుకను ప్రకటించారు....

Flag march | బాన్సువాడలో ఫ్లాగ్​ మార్చ్​.. 19 మంది నిందితుల అరెస్టు

అక్షరటుడే, బాన్సువాడ: Flag march | కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఇటీవల చోటుచేసుకున్న ఘటన నేపథ్యంలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులను జిల్లా పోలీస్...

Hydraa Commissioner Ranganath | రూ.70 వేల కోట్లకు పైగా విలువైన 1,350 ఎకరాల స్థలాలను రక్షించాం : హైడ్రా కమిషనర్​ రంగనాథ్​

అక్షరటుడే, హైదరాబాద్​: Hydraa Commissioner Ranganath | గ్రేటర్​ హైదరాబాద్​లో ఇప్పటివరకు దాదాపు 1,350 ఎకరాల స్థలాలను కబ్జాదారుల కోరల నుంచి కాపాడినట్లు హైడ్రా కమిషనర్...