44
అక్షర టుడే, ఎల్లారెడ్డి: Mla Madan Mohan | సర్పంచ్లు (Sarpanches) ప్రజల మధ్యే ఉంటూ గ్రామాలను అభివృద్ధి బాట పట్టించాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ (MLA Madan Mohan) పేర్కొన్నారు. ఈ మేరకు నాగిరెడ్డిపేట్ మండలం పోచారం గ్రామ నూతన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డ్ మెంబర్లు సోమవారం ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ సర్పంచ్ సంజీవ రావుకు, ఉపసర్పంచ్, వార్డ్ మెంబర్లకు శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసమస్యలను పరిష్కరిస్తూ ముందుడుగు వేయాలని సూచించారు. పోచారం గ్రామానికి (Pocharam village) ఎల్లప్పుడూ తన సహాయ సహకారాలు ఉంటాయని స్పష్టం చేశారు.