Homeజిల్లాలునిజామాబాద్​National Unity Day | నిజాం మెడలు వంచిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్

National Unity Day | నిజాం మెడలు వంచిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్

నిరంకుశ పాలనను అంతమొందించి నిజం మెడలు వంచిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచార్య అన్నారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: National Unity Day | నిరంకుశ పాలనను అంతమొందించి నిజం మెడలు వంచిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal Suryanarayana Gupta), బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచార్య అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ఆర్ఆర్ చౌరస్తా నుంచి వర్ని చౌరస్తా వరకు ఏక్తా ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అఖండ భారత్​ కోసం సర్దార్​ పటేల్​ (Sardar Vallabhbhai Patel) విశేష కృషి చేశారని కొనియాడారు. దేశంలోని 500కు పైగా సంస్థలను ఏకం చేసి అఖండ భారత్ కోసం పరితపించిన గొప్ప నేత అన్నారు. హైదరాబాద్​ను భారత్​లో విలీనం చేసేందుకు ఆపరేషన్ పోలో నిర్వహించారన్నారు. ఆయన ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పసుపు బోర్డు జాతీయ ఛైర్మన్​ పల్లె గంగారెడ్డి, కార్యక్రమ కన్వీనర్ పోతనకర్ లక్ష్మీనారాయణ, జిల్లా పదాధికారులు, మండల అధ్యక్షులు పాల్గొన్నారు.